News February 12, 2025

NZB: టిప్పర్ సీజ్

image

నిజామాబాద్‌లో అక్రమంగా మొరం తరలిస్తున్న టిప్పర్‌ను సీజ్ చేసినట్లు ఐదో టౌన్ ఎస్ఐ గంగాధర్ తెలిపారు. టౌన్ పరిధిలో అక్రమంగా మొరం తరలిస్తుండగా వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్ చిన్న కొండయ్య, యజమాని నర్సయ్యపై కేసు నమోదు చేసినట్లుగా ఎస్ఐ వెల్లడించారు. గతంలో మొరం అక్రమ రవాణా చేసిన పలువురిని తహశీల్దార్ ఎదుట హాజరుపరచగా రూ.5 లక్షల పూచీకత్తుపై సంవత్సరం వరకు బైండోవర్ విధించినట్లు ఎస్ఐ వివరించారు.

Similar News

News January 27, 2026

నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకటరెడ్డి బదిలీ

image

నిజామాబాద్ నగర ఏసీపీ ఎల్. రాజా వెంకటరెడ్డి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో సైబరాబాద్ ఎస్బీ ఏసీపీగా పనిచేస్తున్న బి. ప్రకాష్‌ను నియమిస్తూ డీజీపీ శశిధర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. 2024 ఫిబ్రవరిలో బాధ్యతలు చేపట్టిన రాజా వెంకటరెడ్డి బదిలీ కావడం నగరంలో చర్చనీయాంశమైంది. బదిలీ అయిన ఆయనను డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని అధికారులు ఆదేశించారు.

News January 27, 2026

నిజామాబాద్: ఇందిరమ్మ ఇండ్లకు రూ.266.94 కోట్లు

image

నిజామాబాద్ జిల్లాలో 19,397 ఇందిరమ్మ ఇండ్లు లక్ష్యం కాగా 16,919 ఇండ్లు మంజూరు అయ్యాయని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. అందులో 12,850 మార్కింగ్ పూర్తి అయ్యాయని, 9,865 ఇండ్లు బేస్మెంట్ పూర్తి అయ్యాయన్నారు. రూఫ్ లెవెల్‌కు 6,651 ఇండ్లు, స్లాబ్ లెవెల్‌కు 4,981 ఇండ్లు, 216 ఇండ్లు పూర్తి అయ్యాయన్నారు. ఇందుకోసం రూ.266.94 కోట్లు ఖర్చు చేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు.

News January 27, 2026

నిజామాబాద్ జిల్లాలో 8 భారీ, మధ్య తరహా పరిశ్రమలు

image

నిజామాబాద్ జిల్లాలో 8 భారీ, మధ్య తరహా పరిశ్రమలు రూ.368.45 కోట్ల పెట్టుబడితో స్థాపించబడ్డాయని కలెక్టర్ ఇలా త్రిపాఠి చెప్పారు. వీటి ద్వారా 7,324 మందికి ఉపాధి కల్పించబడిందన్నారు. అలాగే జిల్లాలో 900 సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలను రూ.516.60 కోట్ల పెట్టుబడితో స్థాపించి 6,983 మందికి ఉపాధి కల్పిస్తున్నారని వివరించారు.