News October 16, 2024

NZB: దానిని తొక్కి పెడుతున్న CM రేవంత్: మంద కృష్ణ

image

అసెంబ్లీ సాక్షిగా ఎస్సీ వర్గీకరణను స్వాగతించిన CM రేవంత్ రెడ్డి దానిని అమలు చేయకుండా తొక్కి పెడుతున్నారని MRPS వ్యవస్థాపక, జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. నిజామాబాద్ లో బుధవారం నిర్వహించిన MRPS, MSP అనుబంధ విభాగాల రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ మాదిగలను మోసం చేసిన వారు భారీ మూల్యం చెల్లించుకోకతప్పదన్నారు.

Similar News

News October 17, 2024

నిజామాబాద్ నుంచే భవిష్యత్ కార్యాచరణ: మంద కృష్ణ మాదిగ

image

ఎస్సీ వర్గీకరణ కోసం నిజామాబాద్ నుండే భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని MRPS వ్యవస్థాపక, జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ స్పష్టం చేశారు. బుధవారం ఆయన మాట్లాడుతూ నమ్మక ద్రోహానికి గురైన మాదిగలు ఎంతటి త్యాగాలకైనా వెనుకాడరన్నారు. మాదిగలను మోసగించిన రేవంత్ ప్రభుత్వానికి నిద్ర లేకుండా చేస్తామని హెచ్చరించారు. వర్గీకరణ అమలుపై పాలకులే కుట్ర చేస్తున్నారన్నారు.

News October 17, 2024

NZB: వృద్ధుడి మెడలోంచి 2 తులాల బంగారం గొలుసు అపహరణ

image

నిజామాబాద్ నగరంలోని న్యూ ఎన్జీవోస్ కాలనీలో నివాసముంటున్న సిద్దిరాములు ఇంట్లోకి వచ్చిన ఒక గుర్తు తెలియని వ్యక్తి మాటామాట కలిపి ఆయన మెడలోని రెండు తులాల గొలుసును లాక్కుని పారిపోయాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు సీసీ పుటేజ్ ఆధారంగా ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఘటనా స్థలాన్ని సీసీఎస్ ఇన్స్పెక్టర్ సురేశ్, టౌన్ సీఐ శ్రీనివాసరాజ్ పరిశీలించారు.

News October 16, 2024

KMR: నవోదయ ప్రవేశ పరీక్ష కోసం ఆన్‌లైన్లో దరఖాస్తులు

image

నిజాంసాగర్ జవహర్ నవోదయ విద్యాలయం లో 2025-26 విద్యా సంవత్సరంలో 9వ తరగతి, 11వ తరగతిలో ఖాళీల భర్తీ కోసం అర్హులైన అభ్యర్థులకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రాజు తెలిపారు. అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని చెప్పారు. ఈనెల 30 వరకు చివరి గడువు ఉందని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.