News November 20, 2025
NZB: నకిలీ పత్రాలు సృష్టించి ప్రొఫెసర్కు రూ.47 లక్షలు కూచ్చుటోపి

నిజామాబాద్లో లేని భూమి ఉన్నట్లుగా నకిలీ పత్రాలు సృష్టించి ఓ ప్రొఫెసర్కు రూ.47 లక్షల కుచ్చుటోపి పెట్టారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వినాయక నగర్కు చెందిన ప్రొఫెసర్ కనకయ్యకు ఎకరం భూమి కొనిస్తామని చెప్పి చిలుక సాయిలు, షేక్ అహ్మద్ నబీ, బండి రవి ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి రూ.47 లక్షలు తీసుకున్నారు. తీరా మోసపోయనాని భావించి 4వ టౌన్లో ఫిర్యాదు చేయగా ముగ్గురిపై కేసు నమోదు చేశారు.
Similar News
News November 23, 2025
ఎడారిగా మారిన గుంపుల మానేరు వాగు

ఓదెల మండలం గుంపుల గ్రామంలో మానేరు నదిపై ఉన్న చెక్ డ్యాం కూలిపోవడంతో నది ఎడారిని తలపిస్తోంది. కార్తీక మాసం నవంబర్ 5న వేల సంఖ్యలో భక్తులు పుణ్య స్నానాలకు తరలివచ్చిన మానేరు, కేవలం 15 రోజుల్లోనే నీరు లేక పూర్తిగా ఎండిపోయింది. దీంతో రైతులు, శ్రీ రామభద్ర ఆలయానికి వచ్చే భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు తక్షణమే చొరవ తీసుకుని చెక్ డ్యాంను పునర్నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.
News November 23, 2025
వికారాబాద్లో కాంగ్రెస్ కీలక నేత రాజీనామా.?

వికారాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షులుగా ధారసింగ్ ఐ కమాండ్ నియమించిన విషయం తెలిసిందే. అయితే వికారాబాద్ కీలక నేత అసంతృప్తి చెందారు. అనుచరులతో కలిసి పార్టీకి రాజీనామా చేసే ఆలోచనలో ఓ ముఖ్యమైన నాయకుడు ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే అతను పార్టీ మారితే వికారాబాద్ పరిస్థితి ఏమవుతుందో అని భారీగానే చర్చలు వినిపిస్తున్నాయి. పార్టీ పెద్దల నుంచి బుజ్జగింపుల నడుస్తున్నట్లుగా తెలుస్తోంది.
News November 23, 2025
రాష్ట్రపతి పరిధిలోకి ‘చండీగఢ్’?: స్పందించిన కేంద్రం

పంజాబ్, హరియాణాల సంయుక్త రాజధాని చండీగఢ్పై చట్టాలు చేసే అధికారాన్ని రాష్ట్రపతికి ఇవ్వాలనే ప్రతిపాదన పరిశీలన దశలోనే ఉందని కేంద్రం వెల్లడించింది. ఈ శీతాకాల సమావేశాల్లో దీనిపై బిల్లు ఉండదని స్పష్టం చేసింది. కాగా ఈ ప్రపోజల్ను ఆప్, అకాలీదళ్, INC సహా పంజాబ్ BJP తీవ్రంగా వ్యతిరేకించాయి. కాగా ప్రస్తుతం ఉమ్మడి రాజధానిపై పంజాబ్ గవర్నర్కు పాలనాధికారం ఉంది.


