News April 15, 2025

NZB: నేడు ఉమ్మడి NZB జిల్లాకు ఎమ్మెల్సీ కవిత

image

ఎమ్మెల్సీ కవిత ఉమ్మడి NZB జిల్లాలో పర్యటించనున్నారు. మంగళవారం ఉదయం 10 గంటలకు కామారెడ్డి జిల్లా బాన్సువాడలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సన్నాహక సమావేశంలో పాల్గొంటారు. అనంతరం NZB జిల్లా బోధన్‌లో మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ వెంకటేశ్వర్ దేశాయి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. సాయంత్రం 4 గంటలకు డిచ్‌పల్లిలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభ సన్నాహక సమావేశంలో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.

Similar News

News April 16, 2025

NZB: ‘అసత్య ప్రచారాలు చేసే వారిపై క్రిమినల్ కేసులు’

image

రేషన్ షాపుల్లో పంపిణీ చేసే సన్న బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం ఉన్నాయంటూ సామాజికమాధ్యమాల్లో వస్తున్న ప్రచారం అవాస్తవమని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి అరవింద్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేస్తున్న నేపథ్యంలో ప్రజలను ఆందోళనకు గురి చేసి సమాజంలో అశాంతి సృష్టించాలనే దురుద్ధేశంతో కొందరు సామాజికమాధ్యమాల్లో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్నారు. అలాంటి వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు.

News April 16, 2025

NZB: శని పుత్రుడు పోచారం: జీవన్ రెడ్డి

image

బాన్సువాడ MLA పోచారం శ్రీనివాస్ రెడ్డి నమ్మక ద్రోహి, వెన్నుపోటు దారుడని BRS నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి ఆరోపించారు. బాన్సువాడలో మంగళవారం జరిగిన BRS రజతోత్సవ సభ సన్నాహాక సమావేశంలో ఆయన మాట్లాడారు. పోచారం శ్రీనివాసరెడ్డిని CM కేసీఆర్ లక్ష్మీ పుత్రుడు అని ప్రేమగా పిలిచేవారన్నారు. అయితే ఆయన లక్ష్మీ పుత్రుడు కాదని, శని పుత్రుడు అని ఎద్దేవా చేశారు.

News April 16, 2025

నిజామాబాద్ జిల్లా జడ్జీ సునీతా కుంచాల బదిలీ

image

నిజామాబాద్ జిల్లా జడ్జిగా పని చేస్తున్న సునీతా కుంచాల బదిలీ అయ్యారు. ఆమె పెద్దపల్లి జిల్లాకు ట్రాన్స్‌ఫర్ అయ్యారు. నిజామాబాద్ జిల్లాకు నూతన జడ్జిగా జీవీఎన్ భరతలక్ష్మి నియమితులయ్యారు. ప్రస్తుతం ఆమె హైదరాబాద్‌లోని లేబర్ కోర్టులో ప్రిసైడింగ్ ఆఫీసర్‌గా పని చేస్తున్నారు. ఈ మేరకు బదిలీలు చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.

error: Content is protected !!