News June 29, 2024

NZB: పదవుల రేసులో ఆ ఇద్దరు నేతలు

image

ఢిల్లీలో కాంగ్రెస్ PCC అధ్యక్షుడి నియామకంతో పాటు మంత్రివర్గ విస్తరణపై కసరత్తు సాగుతోంది. జిల్లా నుంచి ఇద్దరి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. MLC మహేశ్‌కుమార్ గౌడ్, అధ్యక్షపీఠాన్ని ఆశిస్తున్నారు. NZBఎంపీగా 2సార్లు గెలిచిన మధుయాష్కీ కూడా ఈ పదవీ కోసం ప్రయత్నిస్తున్నారు. మంత్రి వర్గ విస్తరణలో జిల్లాకు ప్రాతినిధ్యం లభించలేదు. కాగా జిల్లా నుంచి సుదర్శన్ రెడ్డి పేరు పరిశీలనలో ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

Similar News

News July 1, 2024

NZB: కుటుంబ కలహాలతో వ్యక్తి సూసైడ్

image

భార్యాభర్తల మధ్య గొడవలు రావడంతో కలత చెంది ఓ వ్యక్తి ఉరివేసుకుని మృతి చెందారు. ఎస్సై యాదగిరి గౌడ్ తెలిపిన వివరాలు.. సిద్ధాపూర్ గ్రామానికి చెందిన సుద్ధపల్లి చంద్రన్న(47) వ్యక్తి కొంతకాలంగా నవీపేట మండలం జన్నేపల్లిలో కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నారు. కుటుంబ కలహాల కారణంగా జీవితంపై విరక్తి చెంది ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పారు. కేసు, దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.

News July 1, 2024

కామారెడ్డి: టమాట రైతు ‘పంట’ పండింది

image

కామారెడ్డి జిల్లా సదాశివనగర్ ​మండలం కుప్రియాల్​లో టమాట రైతు పంట పడింది. గ్రామానికి చెందిన స్వరూప భూంరెడ్డి దంపతులు ఎకరం భూమిలో రెండు నెలల మల్చింగ్​పద్ధతిలో టమాట సాగు చేశారు. ప్రతి రోజు టమాటలను తెంపి 30కి పైగా బాక్సుల్లో కామారెడ్డి, HYDకు తరలిస్తున్నామని, ప్రస్తుతం కిలో టమాటా రూ.70 నుంచి రూ. 100 వరకు పలకడంతో.. రూ. 10 లక్షల లాభం ఉందని సదరు రైతు తెలిపారు.

News July 1, 2024

NZB: నేటి నుంచే కొత్త నేర చట్టాల అమలు

image

నేరాల సంఖ్య తగ్గించి బాధితులకు సత్వర న్యాయం జరిగేందుకు కొత్త నేర చట్టాలను జిల్లాలో నేటి నుంచి పోలీస్‌శాఖ అమలు చేయనుంది. అందుకోసం పోలీసు శాఖలో విధులు నిర్వహిస్తున్న 1040 మందికి కొత్త చట్టాలపై శిక్షణ ఇచ్చారు. మారిన కొత్త చట్టాల గురించి బాధితులకు వివరించడానికి జిల్లా లీగల్ అథారిటీ ఆధ్వర్యంలో అవగాహన సదస్సులను ఏర్పాటు చేయనుంది.