News June 26, 2024
NZB: పూర్వ ప్రాథమిక విద్య ప్రారంభానికి చర్యలు: రాష్ట్ర కార్యదర్శి కరుణ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_62024/1719322310554-normal-WIFI.webp)
అంగన్వాడీ కేంద్రాల్లో పూర్వ ప్రాథమిక విద్య ప్రారంభానికి చర్యలు చేపట్టాలని రాష్ట్ర మహిళా శిశుసంక్షేమ శాఖ కార్యదర్శి వాకాటి కరుణ అన్నారు. జిల్లా కలెక్టర్లతో ఆమె మంగళవారం వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడారు. ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేలా వాల్ పెయింటింగ్స్ వేయించాలని సూచించారు. పిల్లల పోషక లోపాల నివారణ కట్టుదిట్టమైన చర్యలను చేపట్టి ప్రాథమిక విద్యకేంద్రాలుగా మార్చాలని పేర్కొన్నారు.
Similar News
News June 29, 2024
డీఎస్ మరణం.. ఎమోషనల్ పోస్ట్ చేసిన ఎంపీ అర్వింద్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_62024/1719626937017-normal-WIFI.webp)
తన తండ్రి D.శ్రీనివాస్ మృతి పట్ల ఎంపీ అర్వింద్ FB ఎమోషనల్ పోస్టు చేశారు. ‘అన్నా అంటే నేనున్నా అని.. ఏ ఆపదలో అయినా ఆదుకునే శీనన్న ఇక లేరు. I WILL MISS YOU DADDY! నా తండ్రి, నా గురువు అన్నీ మా నాన్నే..! ఎదురొడ్డు, పోరాడు, భయపడకు అని నేర్పింది మా నాన్నే.. ప్రజలను ప్రేమించు. వారి కొరకే జీవించు అని చెప్పింది మా నాన్నే. నాన్న..! నువ్వు ఎప్పటికీ మాతోనే ఉంటావు, ఎప్పటికీ మాలోనే ఉంటావు’ అని పోస్ట్ చేశారు.
News June 29, 2024
NZB: పదవుల రేసులో ఆ ఇద్దరు నేతలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_62024/1719622463762-normal-WIFI.webp)
ఢిల్లీలో కాంగ్రెస్ PCC అధ్యక్షుడి నియామకంతో పాటు మంత్రివర్గ విస్తరణపై కసరత్తు సాగుతోంది. జిల్లా నుంచి ఇద్దరి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. MLC మహేశ్కుమార్ గౌడ్, అధ్యక్షపీఠాన్ని ఆశిస్తున్నారు. NZBఎంపీగా 2సార్లు గెలిచిన మధుయాష్కీ కూడా ఈ పదవీ కోసం ప్రయత్నిస్తున్నారు. మంత్రి వర్గ విస్తరణలో జిల్లాకు ప్రాతినిధ్యం లభించలేదు. కాగా జిల్లా నుంచి సుదర్శన్ రెడ్డి పేరు పరిశీలనలో ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
News June 28, 2024
NZB: జీజీహెచ్లో బోధనా వైద్యుల నిరసన
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_62024/1719581798079-normal-WIFI.webp)
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ఎదుట శుక్రవారం బోధనా వైద్యులు ఆందోళన చేపట్టారు. నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బోధనా వైద్యుల సంఘం జిల్లా అధ్యక్షుడు డాక్టర్. కిరణ్ ప్రకాశ్ మాట్లాడుతూ.. నల్గొండలోని జనరల్ ఆస్పత్రిలో వైద్యుల హాజరును పర్యవేక్షించేందుకు రోజుకో ఆఫీసర్ను నియమిస్తూ అక్కడి కలెక్టర్ నిర్ణయం తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు.