News April 12, 2024

NZB: పోలీసుల తనిఖీల్లో రూ. 7,21,587 నగదు పట్టివేత

image

నిజామాబాద్ నగరంలో పోలీసులు శుక్రవారం నిర్వహించిన వాహన తనిఖీల్లో పెద్దమొత్తంలో నగదు సీజ్ చేశారు. నగర సీఐ నరహరి ఆధ్వర్యంలో ఎల్లమ్మగుట్ట సమీపంలో చేపట్టిన తనిఖీల్లో ఓ వ్యక్తి సరైన పత్రాలు చూపకుండా తరలిస్తున్న రూ. 7,21,587 నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఎన్నికల గ్రీవెన్స్ కమిటీకి నగదును అందజేశారు. ఈ తనిఖీల్లో నాలుగో టౌన్ ఎస్సై సంజీవ్, ఏఎస్సై రామకృష్ణ, సిబ్బంది రమేష్, అనిల్, మనోజ్ పాల్గొన్నారు.

Similar News

News September 10, 2025

NZB: వాగులో గుర్తు తెలియని మృతదేహం

image

నిజామాబాద్ బోర్గాం వాగులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని బుధవారం స్థానికులు గుర్తించారు. వారు 4వ టౌన్​ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీయించి జిల్లా ఆసుపత్రికి తరలించారు. మృతుడి వయస్సు 35-40 ఉంటుందని పోలీసులు చెప్పారు. కాగా మృతుడు ఆత్మహత్య చేసుకొన్నాడా? లేక ఎవరైనా హత్య చేశారా? అనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News September 10, 2025

NZB జిల్లా నుంచి ఇద్దరు నేతలు BJP రాష్ట్ర కార్యవర్గంలోకి

image

నిజామాబాద్ స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు జిల్లా నుంచి ఇద్దరు నాయకులను బీజేపీ రాష్ట్ర కార్యవర్గంలోకి తీసుకున్నారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ బీజేపీ ఫ్లోర్ లీడర్ జీ.స్రవంతి రెడ్డిని రాష్ట్ర కార్యదర్శిగా, పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు బస్వాపురం లక్ష్మీనర్సయ్యను బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు ప్రకటించారు.

News September 10, 2025

NZB: సబ్ జూనియర్ బాస్కెట్‌బాల్ సెలక్షన్స్ నేడు

image

నిజామాబాద్ జిల్లా బాస్కెట్‌బాల్ సంఘం ఆధ్వర్యంలో స్థానిక డీఎస్ఏ మైదానంలో ఇవాళ ఉదయం 11:30కు సబ్ జూనియర్స్ బాస్కెట్‌బాల్ క్రీడాకారుల ఎంపికలు నిర్వహించనున్నట్లు బాస్కెట్‌బాల్ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు విజయ్ కుమార్, బొబ్బిలి నరేష్ తెలిపారు. ఈ సెలక్షన్స్‌లో పాల్గొనే క్రీడాకారులు 2012 జనవరి 1 తర్వాత జన్మించి ఉండాలన్నారు. ఇతర వివరాల కోసం ఆర్గనైజింగ్ కార్యదర్శి నిఖిల్‌ను సంప్రదించవచ్చని సూచించారు.