News August 25, 2025

NZB: ప్రజావాణికి 102 ఫిర్యాదులు

image

ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 102 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు కలెక్టర్‌తో పాటు ఉన్నతాధికారులకు అర్జీలు అందజేశారు. అర్జీలను పెండింగ్‌లో పెట్టకుండా సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు.

Similar News

News August 25, 2025

SRSP UPDATE: తగ్గిన ఇన్ ఫ్లో.. వరద గేట్ల మూసివేత

image

శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో తగ్గడంతో సోమవారం మధ్యాహ్నం వరద గేట్లను మూసివేశారు. సోమవారం సాయంత్రం 4 గంటలకు 29,907 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి వస్తోందని, దిగువకు అంతే మొత్తంలో వదులుతున్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ఇందిరమ్మ కాలువకు 20 వేలు, కాకతీయ కాల్వకు 3,500, సరస్వతి కాల్వకు 500, లక్ష్మీ కెనాల్‌కు 150, అలీ సాగర్ లిఫ్ట్‌కు 360 క్యూసెక్కుల నీరు వదులుతున్నామన్నారు.

News August 25, 2025

NZB: విగ్రహాలు తరలించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి: CP

image

గణేశ్ మండలి నిర్వహకులు విగ్రహాలను తరలించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని నిజామాబాద్ CP సాయి చైతన్య సూచించారు. కొన్ని రోజులుగా 4 విద్యుత్ ప్రమాదాలు జరిగాయని, వాటిలో 9 మంది యువకులు మరణించారని పేర్కొన్నారు. గణేశ్ విగ్రహాల రవాణా, స్థాపించే మండపాల వద్ద ప్రాథమిక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా విద్యుత్ పోల్స్ వద్ద జాగ్రత్తగా ఉండాలని అన్నారు.

News August 25, 2025

కాంగ్రెస్‌వి డైవర్షన్ పాలిటిక్స్: NZB ఎంపీ

image

ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా రాష్ట్రంలో కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి ఆరోపించారు. సోమవారం నిజామాబాదులో జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లాలో కాషాయ జెండా ఎగరడం ఖాయమన్నారు.