News August 26, 2025

NZB: భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన పోలీస్ కమిషనర్

image

గణేశ్ ఉత్సవాల సందర్భంగా నిజామాబాద్‌లో భద్రతా ఏర్పాట్లను పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మంగళవారం రాత్రి పరిశీలించారు. ఫుట్ పెట్రోలింగ్ చేస్తూ ముఖ్యమైన గణేశ్ మండపాలు, ప్రధాన రహదారులు, చౌరస్తాల వద్ద భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. పోలీసులు 24 గంటలు అందుబాటులో ఉంటారని చెప్పారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని సీపీ పేర్కొన్నారు.

Similar News

News August 27, 2025

NZB: జాతీయస్థాయి బేస్‌ బాల్ పోటీలకు జిల్లా క్రీడాకారులు

image

జాతీయస్థాయి బేస్‌ బాల్ ఛాంపియన్షిప్‌కు నిజామాబాద్ జిల్లా క్రీడాకారులు ఎంపికైనట్లు అసోసియేషన్ కార్యదర్శి వినోద్ తెలిపారు. ఇటీవల ఆదిలాబాద్‌లో జరిగిన రాష్ట్రస్థాయి టోర్నమెంట్‌లో మహిళ జట్టు ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేసిన సౌమ్యారాణి, శృతి, అనూష, శరణ్య, పురుషుల విభాగంలో సాయి కుమార్ ఎంపికయ్యారు. ఈ నెల 28 నుంచి 31 వరకు మహారాష్ట్రలోని అమరావతిలో జరిగే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటారని చెప్పారు.

News August 26, 2025

NZB: మహిళా, శిశు సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలి: కలెక్టర్

image

మహిళా, శిశు సంక్షేమం కోసం నిర్దేశించిన కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేస్తూ, సంపూర్ణ లక్ష్య సాధనకు అంకిత భావంతో కృషి చేయాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. మంగళవారం సాయంత్రం ఆయన కలెక్టరేట్‌లో మహిళా, శిశు సంక్షేమ శాఖ పనితీరుపై కలెక్టర్ సమీక్ష జరిపారు. నూతనంగా మంజూరైన అంగన్వాడి భవనాల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని ఇంజినీరింగ్ విభాగం అధికారులను ఆదేశించారు.

News August 26, 2025

NZB: CP ఎదుట 28 మంది బైండోవర్

image

గణేశ్ విగ్రహాల నిమజ్జనం, మిలాద్-ఉల్-నబి, దుర్గామాత ఉత్సవాల నేపథ్యంలో మంగళవారం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఎదుట 28 మందిని బైండోవర్ చేశారు. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్‌లలో కేసులు నమోదైన DJ ఆపరేటర్లు, DJ యజమానులు, ట్రబుల్ మాంగర్స్‌ను బైండోవర్ చేశారు. వచ్చే 6 నెలల పాటు సత్ప్రవర్తనను కొనసాగించాలని సీపీ ఆదేశించారు.