News May 5, 2024

NZB: మల్లారం అటవీ ప్రాంతంలో వ్యక్తి దారుణ హత్య

image

జిల్లాలోని మల్లారం అటవీ ప్రాంతంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడు ఆదిలాబాద్ జిల్లాకు చెందిన గంగయ్య (38)గా పోలీసులు గుర్తించారు. గత నెల 22న ఇంటి నుంచి బయటకు వెళ్లిన గంగయ్య తిరిగి ఇంటికి చేరుకోకపోవడంతో కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాల్ డిటేల్స్ ఆధారంగా గంగయ్య NZBకు చెందిన వ్యక్తితో మాట్లాడినట్లు గుర్తించారు. సదరు వ్యక్తి అదుపులోకి తీసుకొని విచారించగా విషయం వెలుగులోకి వచ్చింది.

Similar News

News October 14, 2024

వేల్పూర్: అధైర్య పడొద్దు నేనున్నాను: మాజీ మంత్రి

image

వేల్పూర్, భీంగల్ మండలంలో కుటుంబ సభ్యులను కోల్పోయిన పలువురు ఆత్మీయులను మాజీ మంత్రి, బాల్కొండ MLA వేముల ప్రశాంత్ రెడ్డి ఇవాళ పరామర్శించారు. మెండోరా గ్రామ మాజి సర్పంచ్ బెల్దారి పోషన్న ఇటీవల అనారోగ్యానికి గురై మరణించడంతో కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇక మోతె గ్రామానికి చెందిన గంగా గౌడ్ మరణించడంతో కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అధైర్య పడొద్దు మీకు నేనున్నానంటూ భరోసా కల్పించారు.

News October 14, 2024

భీంగల్: రూ.1,00,000 పలికిన దుర్గామాత లడ్డు

image

భీంగల్ మండల కేంద్రంలో హనుమాన్ యువజన సంఘం నందిగల్లి భీంగల్ ఆధ్వర్యంలో దుర్గమాత లడ్డు వేలంపాట నిర్వహించారు. కాగా అదే గ్రామానికి చెందిన పిల్లోళ్ల.రాములు అనే వ్యక్తి రూ. 1,00,000/- లడ్డును దక్కించుకున్నారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు లడ్డును పిల్లోల్ల రాములు కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

News October 13, 2024

NZB: ‘ఆ స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించడం అభినందనీయం’

image

తెలంగాణ సంప్రదాయాల స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించడం అభినందనీయమని TPCC అధ్యక్షుడు, MLC మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన “అలయ్ బలయ్” కార్యక్రమంలో పాల్గొన్న మహేష్ కుమార్ మాట్లాడుతూ దత్తాత్రేయ 19 ఏళ్లుగా జెండాలు, ఎజెండాలకు అతీతంగా దసరా మరుసటి రోజు నిర్వహిస్తోన్న ఈ కార్యక్రమం స్పూర్తి అని కొనియాడారు.