News January 13, 2026
NZB: మున్సిపోల్.. మహిళా ఓటర్లే అధికం

మున్సిపల్ ఎన్నికల తుది ఓటరు జాబితాను అధికారులు విడుదల చేశారు. NZB కార్పొరేషన్లో మొత్తం ఓటర్లు 3,48,051 మంది ఉండగా.. మహిళలు 1,80,546, పురుషులు 1,67,461,
బోధన్లో మొత్తం ఓటర్లు 69,417 మంది కాగా మహిళలు 35,720, పురుషులు 33,696,
భీమ్గల్లో మొత్తం 14,045 మంది ఓటర్లు ఉండగా మహిళలు 7,429, పురుషులు 6,616,
ఆర్మూర్లో మొత్తం ఓటర్లు 63,972 మంది ఉండగా మహిళలు 33,322, పురుషులు 30,648, ఇతరులు ఇద్దరు ఉన్నారు.
Similar News
News February 18, 2026
NZB: అభివృద్ధి తమ లక్ష్యమంటున్న ప్రథమ పౌరులు..!

NZB మున్సిపల్ కార్పొరేషన్తో పాటు బోధన్, ఆర్మూర్, భీంగల్ పురపాలక సంఘాల్లో ప్రథమ పౌరులుగా మహిళలే ఎన్నికవ్వడం విశేషం. NZB మేయర్గా కూరగాయల ఉమారాణి, బోధన్ మున్సిపాలిటీ ఛైర్పర్సన్గా తూము పద్మ, ఆర్మూర్ మున్సిపాలిటీ ఛైర్ పర్సన్గా లహరి, భీంగల్ మున్సిపాలిటీ ఛైర్ పర్సన్ గా బొదిరే నాగమణి ఎంపికైన సంగతి తెలిసిందే. వీరందరూ తమ ప్రాంతాలను అభివృద్ధి చేసి చూపుతామని అంటున్నారు.
News February 18, 2026
నిజామాబాద్లో టమాటా ధర ఎంతంటే?

నిజామాబాద్లో టమాటా ధర బాగా తగ్గింది. హోల్సేల్లో కిలో రూ.4-5 ఉండగా రిటైల్ మార్కెట్లో రూ.10 కిలోగా ఉంది. ఇక బెండకాయ, బీరకాయ రూ.80 కిలో, పచ్చి మిర్చి రూ.70, ఆలుగడ్డలు రూ.20, చిక్కుడుకాయ రూ.40, క్యాప్సికం రూ.60, క్యారెట్ రూ.50, బీట్ రూట్ రూ.50, వంకాయ రూ.40, చామ గడ్డ రూ.50, బిన్నీస్ రూ.80 కిలో, సొరకాయ ఒకటి 10 నుంచి 20 రూపాయలుగా ఉంది. కొత్తిమీర కట్ట రూ.10 నుంచి 20 రూపాయల వరకు విక్రయిస్తున్నారు.
News February 18, 2026
మోపాల్: చెరువులో పడి పశువుల కాపరి మృతి: SI సుస్మిత

చిన్నాపూర్ చెరువులో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మాణిక్యం (38) అనే పశువుల కాపరి మృతి చెందినట్లు మోపాల్ SI సుస్మిత తెలిపారు. నిర్మల్ జిల్లా బైంసా మండలానికి చెందిన మాణిక్యం ఉపాధి నిమిత్తం ఇక్కడికి వచ్చి కూలీ పనులు చేస్తున్నట్లు చెప్పారు. మంగళవారం చెరువులో స్నానానికి వెళ్లి మృతి చెందాడన్నారు.


