News October 9, 2024
NZB: మేమున్న చోటుకే రావాలి: డిజిటల్ సర్వే చిత్రాలు
ఫ్యామిలీ డిజిటల్ కార్డుల సర్వే నిజామాబాద్ నగరంలో తూ తూ మంత్రంగా కొనసాగుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి ఉదాహరణగా 3వ డివిజన్ పరిధిలోని గంగస్థాన్ ఫేజ్-2లో నిన్న జరిగిన సర్వే సందర్భంగా నవీపేట్ ప్రాంతానికి చెందిన సర్వే బృందం సభ్యులు తామున్న చోటుకే సర్వే కోసం రావాలన్నారని తెలిపారు. ముఖ్యంగా అపార్టుమెంట్లలో వృద్ధులను కిందికి వచ్చి సర్వేలో కిందకు రావాలని చెప్పి వారు వెళ్లిపోయారన్నారు.
Similar News
News October 10, 2024
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా DCCB డైరెక్టర్ కమలాకర్ రెడ్డి
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా DCCB డైరెక్టర్గా నియమితులైన బీర్కూర్ మండలం దామరంచ సొసైటీ ఛైర్మన్ కమలాకర్ రెడ్డిని పలువురు బుధవారం రాత్రి మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. వీరిలో బీర్కూర్ మండల కాంగ్రెస్ నాయకులు కృష్ణారెడ్డి, పోగు పాండు, ఓంకార్, ఈరాజ్ సాయిలు, నర్ర సాయిలు, సమద్, సతీష్, పిర్గొండ సతీష్, రాజు, బాన్సువాడ నియోజకవర్గం సోషల్ మీడియా ఇన్ఛార్జి బోయిడి లక్ష్మణ్ ముదిరాజ్ ఉన్నారు.
News October 9, 2024
NZB: సద్దుల బతుకమ్మ రేపు.. శనివారం దసరా
సద్దుల బతుకమ్మను ప్రతి ఒక్కరూ రేపు నిర్వహించుకోవాలని నిజామాబాద్ పురోహితులు బ్రహ్మశ్రీ జ్యోషి మధుసూదన శర్మ తెలిపారు. ఏటా సద్దుల బతుకమ్మ జరుపుకునే వారని, ఈ సంవత్సరం ఒకరోజు ఎడ రావడంతో దసరా పండుగ శనివారం వస్తుందన్నారు. ప్రజలంతా 12వ తేదీననే దసరా నిర్వహించుకోవాలని తెలిపారు.
News October 9, 2024
భీంగల్: టాటా ఏస్ ఢీకొని బాలుడు మృతి
భీంగల్ పట్టణంలో అతివేగంగా వెళుతున్న టాటా ఏస్ వాహనం ఢీకొని బాలుడు మృతి చెందాడు. మంగళవారం సాయంత్రం భీంగల్ నుంచి సిరికొండకు వెళ్తున్న టాటా ఏస్ వాహనం డ్రైవర్ అఫ్రోజ్ భీంగల్ పట్టణంలో నంది నగర్ వద్ద రోడ్డు దాటుతున్న తోపారపు నిశ్వంత్(7)ను ఢీ కొట్టడంతో తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. బాలుడిని ఆర్మూర్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు ఎస్సై మహేష్ తెలిపారు.