News December 11, 2025
NZB: మొదటి రెండు గంటల్లో 19.80 శాతం పోలింగ్

తొలి దశ ఎన్నికల్లో ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు 164 GPల్లో నమోదైన పోలింగ్ శాతం మండలాల వారీగా ఇలా
బోధన్ మండలంలో 26.26%,
చందూరు-16.63%
కోటగిరి- 17.76%
మోస్రా-15.42%
పోతంగల్- 19.76%
రెంజల్- 23.99%
రుద్రూరు-10.38%
సాలూర- 24.30%
వర్ని-19.62%
ఎడపల్లి-20.48%
నవీపేట -17.07% పోలింగ్ నమోదైనట్లు అధికారులు వివరించారు.
Similar News
News December 15, 2025
NZB: వాటి వల్ల ప్రాణహాని కలిగితే హత్య కేసు: CP

చైనా మాంజాతో వ్యక్తులకు ప్రాణహాని జరిగితే హత్యానేరం కేసు నమోదు చేస్తామని CPసాయిచైతన్య హెచ్చరించారు. చైనా మాంజా వాడటం ప్రమాదకరమని, ప్రజలు, జంతువులు, పక్షులకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందన్నారు. చైనా మాంజా నిల్వ ఉంచినా, తయారు చేసి విక్రయించినా, ప్రోత్సహించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ఎవరి వద్ద అయినా చైనా మాంజా ఉన్నట్లయితే వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్లో అప్పగించాలని సూచించారు.
News December 14, 2025
సిర్నాపల్లిలో దొంగ ఓటుకు యత్నం.. ఉద్రిక్తత

ఇందల్వాయి మండలం సిర్నాపల్లిలో ఓటింగ్ సమయంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. ఓ వర్గానికి చెందిన ఓ వ్యక్తి తన ఓటును వేశాడు. విదేశాల్లో ఉండే మరో వ్యక్తి ఓటును వేసేందుకు మళ్లీ పోలింగ్ బూత్లోకి ప్రవేశించాడు. అయితే బూత్ ఏజెంట్లు, ఎన్నికల అధికారుల అప్రమత్తతతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనతో గ్రామంలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
News December 14, 2025
నిజామాబాద్: సర్పంచ్గా తొలి విజయం మహిళదే

నిజామాబాద్ జిల్లాలో రెండో విడత సర్పంచ్ ఫలితాలు వెలువడుతున్నాయి. మోపాల్ మండలం శ్రీరాంనగర్తండా సర్పంచ్గా గుగులోత్ సరోజ 84 ఓట్ల మెజారిటీతో ప్రత్యర్థి బస్సీ సునీతపై విజయం సాధించారు. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి గెలుపొందటంతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాల్లో మునిగి తేలారు. ఉపసర్పంచ్ ఎన్నికపై సమాలోచనలు చేస్తున్నారు.


