News March 2, 2025

NZB: యథావిధిగా ప్రజావాణి కార్యక్రమం: కలెక్టర్

image

ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ నెల 3వ తేదీ నుంచి యథావిధిగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. శాసన మండలి ఎన్నికల పోలింగ్ దృష్ట్యా ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేశారు. ఈ కార్యక్రమం తిరిగి సోమవారం నుంచి ప్రారంభం కానుంది.

Similar News

News March 3, 2025

NZB: రూ.10 వేలు లంచం తీసుకుంటూ చిక్కిన సబ్ రిజిస్ట్రార్

image

నిజామాబాద్ అర్బన్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సోమవారం ACBదాడి జరిగిన సంగతి తెలిసిందే. కార్యాలయంలో రెండో సబ్ రిజిస్ట్రార్‌గా విధులు నిర్వర్తిస్తున్న రామరాజు ఏసీబీకి చిక్కారు. రామరాజు ఓ వ్యక్తి నుంచి రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా నిజామాబాద్ ఏసీబీ DSP శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పూర్తి వివరాలు సోదాలు పూర్తయ్యాక ప్రకటిస్తామని DSP తెలిపారు.

News March 3, 2025

NZB: అర్బన్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ACB తనిఖీలు

image

నిజామాబాద్ అర్బన్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సోమవారం ఉదయం అవినీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఓ సబ్ రిజిస్ట్రార్‌ను విచారిస్తున్నట్లు తెలిసింది. అర్బన్ కార్యాలయం పరిధిలో ప్రస్తుతం ఇద్దరు రెగ్యులర్ సబ్ రిజిస్ట్రార్లు పని చేస్తున్నారు. కాగా తనిఖీలకు సంబంధించిన పూర్తి వివరాలు ఏసీబీ అధికారులు త్వరలో వెల్లడించనున్నారు.

News March 3, 2025

నిజామాబాద్ జిల్లాలో మండుతున్న ఎండలు

image

నిజామాబాద్ జిల్లాలో ఎండలు మండుతున్నాయి. ఆదివారం పోతంగల్, కోటగిరిలో 39.2℃ ఉష్ణోగ్రత నమోదైంది. మెండోరా- 38.9, లక్మాపూర్- 38.5, చిన్న మావంది, జక్రాన్‌పల్లి -38.4, ధర్పల్లి -38.3, సాలూరా, వేపూర్- 38.1, ఎడపల్లి -38, గోపన్నపల్లి- 37.9, కమ్మర్‌పల్లి, పెర్కిట్ -37.7, మంచిప్ప, రెంజల్ -37.6, వెంపల్లి, నిజామాబాద్ -37.5, తొండకూర్, కల్దుర్కి, కొండూర్- 37.3, మోర్తాడ్- 37.2, ఏర్గట్లలో 37.1℃గా నమోదైంది.

error: Content is protected !!