News December 24, 2025
NZB: రాబోయే ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహించాలి: కలెక్టర్

గ్రామ పంచాయతీ ఎన్నికల తరహాలోనే రానున్న రోజుల్లో జరుగనున్న MPTC, ZPTC ఎన్నికలను కూడా సమర్ధవంతంగా నిర్వహించాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. పంచాయతీ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించిన సందర్భాన్ని పురస్కరించుకుని మంగళవారం కలెక్టరేట్లో MPDOలు, MPOలు సక్సెస్ మీట్ నిర్వహించగా కలెక్టర్ మాట్లాడారు. ఎన్నికల విధులు ఎప్పుడు కూడా సవాళ్లతో కూడుకుని ఉంటాయని అన్నారు.
Similar News
News December 29, 2025
నిజామాబాద్: ప్రజావాణికి 93 ఫిర్యాదులు

ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. సోమవారం నిజామాబాద్ కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో 93 ఫిర్యాదులు స్వీకరించినట్లు చెప్పారు. ఫిర్యాదులను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.
News December 29, 2025
నవీపేట్: అంగన్వాడి సెంటర్లో పేలిన కుక్కర్

నవీపేట్ మండలం రాంపూర్ గ్రామ అంగన్వాడీ సెంటర్లో సోమవారం కుక్కర్ పేలిన ఘటనలో ముగ్గురు చిన్నారులు గాయపడ్డారు. గాయపడిన ముగ్గురిని రెంజల్ 108 సిబ్బంది లక్ష్మణ్, నయీమ్ ప్రథమచికిత్స చేసి నిజామాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. పిల్లల కోసం కుక్కర్లో పప్పు ఉడికిస్తున్న సమయంలో అది పేలి సమీపంలోని ఉన్న చిన్నారులకు గాయాలయ్యాయి. వంట చేసే సమయంలో జాగ్రత్తలు తీసుకొని పిల్లలను దూరంగా ఉంచాలని గ్రామస్థులు కోరారు.
News December 29, 2025
NZB: KCR అంత నమ్మక ద్రోహి తెలంగాణలోనే లేరు: MP

KCR అంత నమ్మక ద్రోహి తెలంగాణలోనే లేరని NZB ఎంపీ అర్వింద్ ధర్మపురి విమర్శించారు. ఆదివారం ఆయన నిజామాబాద్ జిల్లాలో నిర్వహించిన సర్పంచుల అభినందన సభలో మాట్లాడారు. తెలంగాణ సమాజం నమ్మకాన్ని వమ్ము చేసిన వ్యక్తి KCR అని అన్నారు. రాష్ట్రాన్ని కల్వకుంట్ల కుటుంబం దోచుకుందని ఆరోపించారు. ఆ కుటుంబానికి రాష్ట్రంలో మాట్లాడే అర్హత లేదన్నారు. విద్య, వైద్యం, గ్రామ పరిపాలన వ్యవస్థను KCR కుటుంబం నాశనం చేసిందన్నారు.


