News November 29, 2024
NZB: రోడ్డు నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన

నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం నల్లవెల్లిలో రూ.22 కోట్లలతో నిర్మిస్తున్న రోడ్డు పనులకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శంకుస్థాపన చేశారు. నల్లవెల్లి-మంగ్యానాయక్ తండా రోడ్డు (రూ.4 కోట్లు), నల్లవెల్లి -గౌరారం రోడ్డు (రూ.18 కోట్ల) పనులను ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే భూపతిరెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో కలిసి రోడ్డు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు.
Similar News
News September 18, 2025
NZB: పెండింగ్ కేసులు క్లియర్ చేయాలి: CP

పెండింగ్ కేసులు త్వరగా క్లియర్ చేయాలని నిజామాబాద్ CP సాయి చైతన్య ఆదేశించారు. గురువారం ఆయన జిల్లా పోలీసు అధికారులతో నెలవారీ సమీక్ష నిర్వహించారు. అసాంఘిక కార్యకలాపాలు గంజాయి, జూదం, పీడీఎస్ రైస్ అక్రమ రవాణా లాంటి వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టి పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహణ పెంచాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.
News September 18, 2025
NZB: ఎస్ఆర్ఎస్పీ కాలువలో వృద్ధురాలి శవం

ఎస్సారెస్పీ కాలువలో కొట్టుకువచ్చిన ఓ వృద్ధురాలి శవాన్ని జగిత్యాల(D) మల్యాల(M) నూకపల్లి బ్రిడ్జి వద్ద స్థానికులు గుర్తించారు. శవం ముందుకు కొట్టుకుపోకుండా తాళ్లతో కట్టి ఉంచారు. ఆమె నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ గ్రామానికి చెందిన ప్రభావతిగా గుర్తించారు. ఆమెకు మతిస్థిమితం లేదని కుటుంబసభ్యులు తెలిపారు. సమాచారమందుకున్న పోలీసులకు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News September 18, 2025
NZB: ఎస్ఆర్ఎస్పీ కాలువలో వృద్ధురాలి శవం

ఎస్సారెస్పీ కాలువలో కొట్టుకువచ్చిన ఓ వృద్ధురాలి శవాన్ని జగిత్యాల(D) మల్యాల(M) నూకపల్లి బ్రిడ్జి వద్ద స్థానికులు గుర్తించారు. శవం ముందుకు కొట్టుకుపోకుండా తాళ్లతో కట్టి ఉంచారు. ఆమె నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ గ్రామానికి చెందిన ప్రభావతిగా గుర్తించారు. ఆమెకు మతిస్థిమితం లేదని కుటుంబసభ్యులు తెలిపారు. సమాచారమందుకున్న పోలీసులకు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.