News April 2, 2024
NZB: వాహన తనిఖీల్లో భారీగా నగదు, బంగారం స్వాధీనం

నిజామాబాద్లో నిర్వహించిన వాహనాల తనిఖీల్లో భారీగా నగదు, బంగారు బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నట్లు 1టౌన్ SHO విజయ్ బాబు తెలిపారు. కుమార్ గల్లీలో తనిఖీలు నిర్వహిస్తుండగా గంగ ప్రసాద్ అనే వ్యక్తి ఎలాంటి అక్రమంగా రూ.6,89,500 నగదు, రూ.34,89,500 విలువైన 400 గ్రామాల బంగారు బిస్కెట్లు తరలిస్తుండగా పట్టుకున్నట్లు పేర్కొన్నారు. నగదు, బంగారాన్ని సీజ్ చేసి అతడిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
Similar News
News April 18, 2025
ఆర్మూర్: అపార్ట్మెంట్ పై నుంచి దూకి బాలిక సూసైడ్

ఆర్మూర్ మున్సిపల్ పరిధి పెర్కిట్లో విషాదం చోటుచేసుకుంది. అపార్ట్మెంట్ పై నుంచి దూకి 16 ఏళ్ల బాలిక ఆత్మహత్య చేసుకుంది. కడుపునొప్పి భరించలేక బుధవారం రాత్రి బాలిక అపార్ట్మెంట్ పై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడిందని బాలిక తల్లి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సత్యనారాయణ తెలిపారు.
News April 18, 2025
NZB: జిల్లా ప్రజల ఆత్మీయతను మూట కట్టుకొని వెళ్తున్నా: జడ్జి

జిల్లా ప్రజలు, న్యాయవాదుల ఆత్మీయతను మూట కట్టుకొని వెళ్తున్నానని జిల్లా జడ్జి సునీత కుంచాల అన్నారు. నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జడ్జికి గురువారం వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. ఆమె మాట్లాడుతూ.. న్యాయవాదులు, న్యాయమూర్తుల ఉమ్మడి లక్ష్యం కక్షిదారులకు కాలానుగుణంగా న్యాయ సేవలు అందించడమేనన్నారు. సివిల్, క్రిమినల్ కేసులను పరిష్కరించే వరకు సమష్టిగా శ్రమించామని గుర్తు చేశారు.
News April 18, 2025
NZB: జిల్లా ప్రజల ఆత్మీయతను మూట కట్టుకొని వెళ్తున్నా: జడ్జి

జిల్లా ప్రజలు, న్యాయవాదుల ఆత్మీయతను మూట కట్టుకొని వెళ్తున్నానని జిల్లా జడ్జి సునీత కుంచాల అన్నారు. నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జడ్జికి గురువారం వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. ఆమె మాట్లాడుతూ.. న్యాయవాదులు, న్యాయమూర్తుల ఉమ్మడి లక్ష్యం కక్షిదారులకు కాలానుగుణంగా న్యాయ సేవలు అందించడమేనన్నారు. సివిల్, క్రిమినల్ కేసులను పరిష్కరించే వరకు సమష్టిగా శ్రమించామని గుర్తు చేశారు.