News December 31, 2024
NZB: విషాదం.. రెండంతస్తుల భవనంపై నుంచి పడి మహిళ మృతి

బట్టలు ఆరేయడానికి వెళ్లి భవనంపై నుంచి పడి ఓ మహిళ మృతి చెందినట్లు నిజామాబాద్ 4వ టౌన్ పోలీసులు తెలిపారు. బోర్గాం(పి)కి చెందిన కాలూరి నిహారిక (32) దుస్తులు ఆరవేసేందుకు సోమవారం సాయంత్రం రెండంతస్తుల భవనంపైకి వెళ్లి ప్రమాదవశాత్తు కిందపడింది. అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో కుటుంబసభ్యులు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందిందన్నారు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Similar News
News January 11, 2026
ఆర్మూర్: దంపతుల ఆత్మహత్యాయత్నం

ఆర్మూర్ శివారులో శనివారం సాయంత్రం దంపతులు గడ్డిమందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. ఎస్హెచ్వో సత్యనారాయణ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. వేల్పూర్ మండలం పడిగేలా గ్రామం వడ్డెర కాలనికి చెందిన రవితేజ, భార్య శోభ పట్టణ శివారులోని ఓ వెంచర్లో విషం తాగి ఆపస్మారక స్థితిలోకి వెళ్లారు. గమనించిన స్థానికులు పోలీసులకి సమాచారం ఇచ్చారు. పోలీసులు వారిని చికిత్స కోసం జిల్లా కేంద్రానికి తరలించారు.
News January 11, 2026
NZBకు TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ రాక

TPCC చీఫ్, MLC మహేశ్ కుమార్ గౌడ్ ఆదివారం నిజామాబాద్ వస్తున్నారు. ఉదయం 8 గంటలకు HYD నార్సింగి నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 11.30కు NZB చేరుకుంటారు. 12 గంటలకు స్థానికంగా నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొని మధ్యాహ్నం 3 గంటలకు R&B గెస్ట్ హౌస్లో పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నారు. రాత్రి నిజామాబాద్లో బస చేసి సోమవారం ఉదయం 11 గంటలకు వరంగల్ బయలుదేరి వెళ్తారు.
News January 11, 2026
NZB: చైనా మాంజా విక్రయాలపై పోలీసుల తనిఖీలు

చైనా మాంజా విక్రయాలపై పోలీసులు కొరడా ఝులిపించారు. సీపీ సాయి చైతన్య ఆదేశాల మేరకు NZB, బోధన్, ఆర్మూర్ డివిజన్ పరిధిలోని స్టేషన్ల పరిధిలో భారీగా తనిఖీలు చేశారు. నిషేధిత చైనా మాంజా ఎవరైనా విక్రయించినా, నిల్వ, రవాణా చేసినా నేరమేనని సీపీ తెలిపారు. చైనా మాంజా విక్రయం వల్ల, జంతువులకు, పక్షులకు, మనుషులకు ప్రమాదం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. ఎవరైనా చైనా మాంజా విక్రయిస్తే 100కు సమాచారం ఇవ్వాలన్నారు.


