News November 19, 2025

NZB: వైద్యులు, సిబ్బంది సమయ పాలన పాటించాలి: DMHO

image

NZB జిల్లాలోని PHCలు, సబ్ సెంటర్లలో పని చేస్తున్న వైద్యులు, సిబ్బంది సమయ పాలన పాటించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి (DMHO) డా.రాజశ్రీ ఆదేశించారు. అవుట్ పేషెంట్ల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. గర్భిణుల వివరాల నమోదులో అలసత్వం వహించే ANMలు, ఆశా కార్యకర్తలపై చర్యలు తప్పవని హెచ్చరించారు. వ్యాధి నిరోధక టీకాల ప్రక్రియను వంద శాతం పూర్తి చేయాలని సూచించారు.

Similar News

News February 24, 2026

నవీపేట: దూడను చంపిన చిరుత పులి

image

నవీపేట్ మండలంలోని అబ్బపూర్ (ఎం)లో ఆదివారం అర్ధరాత్రి చిరుతపులి సంచారం భయాందోళన రేకెత్తించింది. బెల్లిడిగే అబ్బన్న అనే రైతు పశువుల పాకపై దాడి చేసిన చిరుత, ఒక దూడను చంపేసింది. సోమవారం ఉదయం యజమాని గమనించి అధికారులకు ఫిర్యాదు చేశారు. బీట్ అధికారులు జాహుర్, సుధీర్ ఘటనా స్థలాన్ని పరిశీలించి అడుగుజాడలను సేకరించారు. వెటర్నరీ డాక్టర్ నరేందర్ రెడ్డి దూడకు పోస్టుమార్టం నిర్వహించారు.

News February 24, 2026

NZB: గోదావరి పుష్కర ఏర్పాట్లపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలి

image

2027 జూలై 23 నుంచి ఆగస్టు 3 వరకు జరుగనున్న గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని చేపట్టాల్సిన ఏర్పాట్లపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని NZB కలెక్టర్ ఇలా త్రిపాఠి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. గత పుష్కరాల్లో గోదావరిలో పుష్కర స్నానం చేసిన భక్తుల సంఖ్య, భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన స్టాళ్లు, తాగునీరు, తాత్కాలిక గదులు, వాహనాల పార్కింగ్, భద్రత, రూట్ మ్యాప్ ఇతర ఏర్పాట్ల వివరాలను చూడాలన్నారు.

News February 24, 2026

NZB: శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు: CP

image

నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని CP సాయి చైతన్య హెచ్చరించారు. సోమవారం ఆయన రుద్రూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ కాలనీలో పర్యటించారు. ఎలాంటి సమస్యలు ఉన్నా సంబంధిత పోలీస్ అధికారులకు లేదా డయల్ 100కు సమాచారం అందించాలని తెలిపారు. అలాగే అల్లర్లు జరిగితే ఎవరిని ఉపేక్షించవద్దని, కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.