News March 1, 2025
NZB: సదరం దరఖాస్తుదారులకు అన్ని రకాల ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్

సదరం సర్టిఫికెట్ల కోసం దరఖాస్తులు చేసుకుని వైకల్య నిర్ధారణ కోసం హాజరయ్యే వారికి అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. ఈ సేవలను సులభతరం చేస్తూ ఇటీవల కొత్తగా యూనిక్ డిజబిలిటీ ఐడీ పోర్టల్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో చేపట్టాల్సిన చర్యల గురించి సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్ కలెక్టర్లు, డీఆర్డీవోలు, డీడబ్ల్యూఓలకు వీసీ ద్వారా సూచించారు.
Similar News
News March 2, 2025
NZB: రాష్ట్ర స్థాయి సైక్లింగ్ పోటీలకు జిల్లా బృందం ఖరారు

తెలంగాణ రాష్ట్ర స్థాయి సైక్లింగ్ పోటీలకు నిజామాబాద్ జిల్లా సైక్లిస్టు బృందం ఖరారైనట్లు జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బి.విజయ్ కాంత్ రావు తెలిపారు. ఈ సందర్భంగా కంఠేశ్వర్ బైపాస్ రోడ్లో జిల్లా స్థాయిలో వివిధ వయోపరిమితిలో ఎంపికల ప్రక్రియ నిర్వహించారు. ఎంపికైన జిల్లా బృందం ఈ నెల 7 నుంచి 9 వరకు హైదరాబాదులో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు.
News March 2, 2025
NZB: వసూళ్లను వేగవంతం చేయాలి: కలెక్టర్

ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు చేరుకున్న దృష్ట్యా పన్ను వసూళ్లను వేగవంతం చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత అధికారులకు సూచించారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలతో పాటు ఇతర సంస్థల నుంచి రావాల్సిన ఆస్తి పన్నును ఆర్థిక సంవత్సరం ముగిసే లోపు నూరు శాతం వసూలు చేసేలా స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేవించారు.
News March 2, 2025
NZB: పార్టీ లైన్ దాటితే ఊరుకునేది లేదు: పీసీసీ చీఫ్

కాంగ్రెస్ పార్టీ నాయకులు సమావేశాలలో మాట్లాడేటప్పుడు పార్టీ లైన్ దాటితే ఊరుకునేది లేదని TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ హెచ్చరించారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్సెండ్ చేయడంపై ఆయన మాట్లాడుతూ మల్లన్నను ఎన్నో సార్లు హెచ్చరించామని తెలిపారు. బీసీ కుల గణన ప్రతులు చించడంపై ఏఐసీసీ సీరియస్ అయిందన్నారు. మల్లన్న చేసిన వాఖ్యలు చాల తప్పని వివరించారు.