News June 27, 2024
NZB: సైబర్ మోసం.. నిందితుడికి జైలు శిక్ష
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_62024/1719495137988-normal-WIFI.webp)
ఓ వ్యక్తి తన గొంతును స్త్రీ గొంతుగా మార్చి బాధితున్ని హనీ ట్రాప్ చేసి డబ్బులు కాజేసిన ఘటన జిల్లాలో వెలుగు చూసింది. ఈ మేరకు సైబర్ క్రైం పోలీస్ స్టేషన్లో హనీ ట్రాప్కు సంబంధించిన నేరంలో నిందితుడిని పట్టుకొని జిల్లా కోర్టులో హాజరు పరచగా, అతనికి జైలు శిక్ష విధించారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సైబర్ నేరానికి గురైతే వెంటనే 1930కి ఫిర్యాదు చేయాలని డీఎస్పీ వెంకటేశ్వర్ రావు సూచించారు.
Similar News
News July 5, 2024
యూకే ఎన్నికల్లో నిజామాబాదీ ఓటమి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720169726405-normal-WIFI.webp)
UKలో జరిగిన ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లాకు చెందిన చంద్ర కన్నెగంటి ఓటమిపాలయ్యారు. ఈయన కన్జర్వేటివ్ పార్టీ తరఫున స్టోక్ ఆన్ ట్రెంట్ సెంట్రల్ స్థానం నుంచి పోటీ చేశారు. ఫలితాల్లో చంద్రకు 6221 ఓట్లు మాత్రమే రావటంతో మూడో స్థానానికి పరిమితమయ్యారు. కోటగిరికి చెందిన చంద్ర చదువు పూర్తి చేసిన తర్వాత లండన్ వెళ్లి స్థిరపడ్డారు. జనరల్ ప్రాక్టిషనర్గా సేవలందిస్తూనే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.
News July 5, 2024
NZB: ఉరేసుకుని కండక్టర్ ఆత్మహత్య
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720160904691-normal-WIFI.webp)
అనారోగ్యం కారణంగా ఆర్టీసీ కండక్టర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన నిజామాబాద్లో జరిగింది. జిల్లాలోని మాక్లూర్ మండలం కల్లెడ గ్రామానికి చెందిన ఈరవత్రి శ్రీనివాస్ (36) కండక్టర్గా పని చేస్తూ నిజామాబాద్ నాందేవ్ వాడాలో అద్దెకు ఉంటున్నాడు. కిడ్నీ నొప్పి భరించలేక గురువారం రాత్రి రూంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News July 5, 2024
కల్వరాల్ శివారులో ఎలుగుబంటి సంచారం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720153798907-normal-WIFI.webp)
సదాశివనగర్ మండలంలోని కల్వరాల్ శివారులో ఎలుగుబంటి సంచరిస్తున్నట్లు స్థానిక రైతులు గురువారం తెలిపారు. దీంతో ప్రధానంగా రైతులు భయబ్రాంతులకు గురయ్యారు. ప్రస్తుతం వ్యవసాయ పంటలు వేసే సమయంలో ఎలుగుబంటి రావడంతో రైతులు భయాందోళన చెందుతున్నారు. అటవీ శాఖ అధికారులు ఎలుగుబంటిని పట్టుకుని ఇతర ప్రాంతానికి తరలించాలని రైతులు కోరుతున్నారు.