News February 10, 2026
NZB: ‘సైలెన్స్ పీరియడ్’ అమల్లో ఉంది!

ఎన్నికల నియమావళిలో భాగంగా సైలెన్స్ పీరియడ్ అమలులో ఉన్నందున ఎన్నికలతో ముడిపడిన అంశాలపై ఎవరూ పత్రికా ప్రకటనలు జారీ చేయరాదని, పత్రికా సమావేశాలు నిర్వహించరాదని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. ఎన్నికల సంఘం ద్వారా అనుమతి కలిగిన అధికారులు మాత్రమే ఎన్నికల నిర్వహణపరమైన అంశాలపై మాట్లాడేందుకు అనుమతి ఉందని తెలిపారు. పోలింగ్ ప్రక్రియ ముగిసే వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని స్పష్టం చేశారు.
Similar News
News February 11, 2026
నిజామాబాద్: పోలింగ్ కేంద్రాల్లో సీపీ పర్యవేక్షణ

నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా బుధవారం సీపీ సాయి చైతన్య పోలింగ్ సరళిని క్షుణ్ణంగా పర్యవేక్షించారు. నగరంలోని ఎస్ఎఫ్ఎస్ స్కూల్, చంద్రశేఖర్ కాలనీ, కోటగల్లి తదితర ప్రాంతాల్లోని బూత్లను సందర్శించి భద్రతను సమీక్షించారు. సీపీ స్వయంగా ఓ వృద్ధుడిని వీల్ చైర్లో పోలింగ్ కేంద్రంలోకి తీసుకెళ్లి మానవత్వం చాటుకున్నారు. ప్రజలు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News February 11, 2026
NZB: 11 గంటల వరకు పోలింగ్ శాతం ఎంతంటే?

నిజామాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి 11 గంటల వరకు ఓవరాల్గా 22.54 శాతం పోలింగ్ నమోదైంది. NZB కార్పొరేషన్ లో 18.94శాతం, BDNలో 32.35%, ARMRలో 29.60%, BMGL మున్సిపాలిటీలో 31.09% పోలింగ్ నమోదైంది. జిల్లాలో 729 పోలింగ్ స్టేషన్లలో 4,95,485 మంది ఓటర్లకు గాను ఇప్పటి వరకు 1,11, 681మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని అధికారులు తెలిపారు.
News February 11, 2026
నిజామాబాద్ జిల్లాలో రెండు గంటల్లో 8.25 శాతం పోలింగ్

మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నిజామాబాద్ జిల్లాలో పోలింగ్ ప్రారంభమైన రెండు గంటల్లో (ఉదయం 9 గంటల వరకు) ఓవరాల్ గా 8.25 శాతం పోలింగ్ నమోదైంది. NZB కార్పొరేషన్తో పాటు BDN, ARMR, BMGL మున్సిపాలిటీల పరిధిలోని 146 వార్డులకు సంబంధించి 729 పోలింగ్ స్టేషన్లలో 4,95,485 మంది ఓటర్లకు గాను 40,857 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారని అధికారులు తెలిపారు.


