News February 18, 2025
NZB: స్టేట్ లెవెల్ స్కేటింగ్లో జిల్లా క్రీడాకారులకు మెడల్స్

స్టేట్ లెవెల్ స్కేటింగ్లో జిల్లా స్వెటర్లు మెడల్స్ సాధించారు. హైదరాబాదులో నిర్వహించిన 13వ ఎస్ ప్రో ట్విన్ సిటీస్ రోలర్ స్కేటింగ్ రాష్ట్రస్థాయి స్కేటింగ్ లో జిల్లా క్రీడాకారులు ప్రతిభ ప్రదర్శించారు. ఇందులో నిజామాబాద్ జిల్లా నుంచి వివిధ కేటగిరీలలో సుమారు 60 మంది క్రీడాకారులు పాల్గొనగా 8 గోల్డ్ మెడల్స్, 12 సిల్వర్ మెడల్స్, 10 బ్రాంజ్ మెడల్స్ సాధించారు.
Similar News
News December 14, 2025
సిర్నాపల్లిలో దొంగ ఓటుకు యత్నం.. ఉద్రిక్తత

ఇందల్వాయి మండలం సిర్నాపల్లిలో ఓటింగ్ సమయంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. ఓ వర్గానికి చెందిన ఓ వ్యక్తి తన ఓటును వేశాడు. విదేశాల్లో ఉండే మరో వ్యక్తి ఓటును వేసేందుకు మళ్లీ పోలింగ్ బూత్లోకి ప్రవేశించాడు. అయితే బూత్ ఏజెంట్లు, ఎన్నికల అధికారుల అప్రమత్తతతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనతో గ్రామంలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
News December 14, 2025
నిజామాబాద్: సర్పంచ్గా తొలి విజయం మహిళదే

నిజామాబాద్ జిల్లాలో రెండో విడత సర్పంచ్ ఫలితాలు వెలువడుతున్నాయి. మోపాల్ మండలం శ్రీరాంనగర్తండా సర్పంచ్గా గుగులోత్ సరోజ 84 ఓట్ల మెజారిటీతో ప్రత్యర్థి బస్సీ సునీతపై విజయం సాధించారు. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి గెలుపొందటంతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాల్లో మునిగి తేలారు. ఉపసర్పంచ్ ఎన్నికపై సమాలోచనలు చేస్తున్నారు.
News December 14, 2025
నిజామాబాద్లో రెండో విడత పోలింగ్ ప్రశాంతం

నిజామాబాద్ జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ
ప్రశాంతంగా ముగిసింది. డిచ్పల్లి మండలంలో స్వల్ప ఘర్షణ జరిగినప్పటికీ పోలీసులు దాన్ని సమర్థవంతంగా నివారించారు. కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, ఎన్నికల పరిశీలకుడు శాంప్రసాద్ లాల్ ఎనిమిది మండలాల్లో తిరుగుతూ పోలింగ్ సరళిని పరిశీలించారు.


