News August 17, 2025

NZB: ‘0’ బిల్లు సబ్సిడీ నిధులు ఎంతంటే?

image

నిజామాబాద్ జిల్లాలో గృహ జ్యోతి పథకం కింద మార్చి 2024 నుంచి జూలై 2025 వరకు 2,67,707 మందికి ‘0’ బిల్లుతో ఉచిత విద్యుత్తు అందించి, ప్రభుత్వం రూ. 165.30 కోట్లు సబ్సిడీగా చెల్లించింది. నాయీ బ్రాహ్మణ, రజక వృత్తులకు చెందిన 3,023 మందికి 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును ఇచ్చారు. సీఎం గిరి వికాస్ పథకం కింద 78 మంది రైతులకు వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్ సౌకర్యం కల్పించారు.

Similar News

News September 8, 2025

నిజామబాద్: ఫిర్యాదులు స్వీకరించిన సీపీ

image

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో సీపీ సాయి చైతన్య అర్జీదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. వారి ఫిర్యాదులను విని పరిష్కారానికి సంబంధిత పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రజలు నిర్భయంగా తమ ఫిర్యాదులు అందించవచ్చన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే తమ లక్ష్యమన్నారు. ప్రజావాణిలో మొత్తం 11 ఫిర్యాదులను ఆయన స్వీకరించారు.

News September 8, 2025

నిజామాబాద్: లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి: సీపీ

image

రాజీ మార్గమే ఉత్తమ మార్గమని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు. సెప్టెంబర్ 13న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ట్రాఫిక్, చిన్నపాటి క్రిమినల్, సివిల్ వివాదాల కేసులను లోక్ అదాలత్ ద్వారా సులభంగా పరిష్కరించుకోవచ్చని సీపీ తెలిపారు. కేసుల పరిష్కారం కోసం ఎదురుచూస్తున్న కక్షిదారులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలన్నారు.

News September 8, 2025

కుప్పం బయలుదేరిన నిజామాబాద్ ప్రభుత్వ ఉపాధ్యాయులు

image

నిజామాబాద్ జిల్లాకు చెందిన 41 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు గురువారం కుప్పం బయలుదేరారు. డీఈఓ అశోక్ ఆధ్వర్యంలో వీరంతా అగస్త్య ఫౌండేషన్ నిర్వహించే ‘మేక్ యువర్ ఓన్ ల్యాబ్’ వర్క్‌షాప్‌లో పాల్గొంటారు. నాలుగు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో సైన్స్, మ్యాథ్స్‌లో ప్రయోగాత్మక పద్ధతులపై శిక్షణ ఇస్తారు. ఈ బృందానికి డీఈఓ అశోక్ వీడ్కోలు పలికారు.