News April 24, 2024
NZB: ‘1200 మంది పోలీసులతో బందోబస్తు’

ఈ నెల 23న నిర్వహించే హన్మాన్ శోభాయాత్రను శాంతియుతంగా నిర్వహించేందుకు 1200 పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు నిజామాబాద్ పోలీస్ కమీషనర్ కల్మేశ్వర్ తెలిపారు. శోభాయాత్ర సందర్భంగా దారి పొడువున CC కెమెరాలు, డ్రోన్లతో పర్యవేక్షించనున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్, బోధన్, ఆర్మూర్, బాన్సువాడ నుంచి వాహనాల దారి మళ్లించినట్లు పేర్కొన్నారు.
Similar News
News April 17, 2026
ఇందూరు కోట.. ఖిల్లా రఘునాథ ఆలయం

నిజామాబాద్ నగర నడిబొడ్డున ఎత్తైన గుట్టపై ఉన్న ఈ కోటను రాష్ట్రకూటులు నిర్మించగా, అనంతరం ఛత్రపతి శివాజీ దీనిని అభివృద్ధి చేశారు. ఇక్కడి రామమందిరం ఆధ్యాత్మికతకు నిలయం. కోటలోని రాతి కట్టడాలు, బురుజులు నాటి ఇంజనీరింగ్ నైపుణ్యానికి సాక్ష్యాలు. పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతున్న ఈ ఆలయం నుండి నగరం మొత్తాన్ని చూడవచ్చు. ఈ చారిత్రక సంపదను కాపాడుకోవడం మన బాధ్యత.
#నేడు ప్రపంచ వారసత్వ దినోత్సవం
News April 16, 2026
నిజామాబాద్: కీటక జనిత వ్యాధులపై నిఘా పెంచాలి – డీఎంహెచ్ఓ

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో మలేరియా, డెంగ్యూ వంటి కీటక జనిత వ్యాధుల నియంత్రణపై సమీక్ష నిర్వహించారు. డీఎంహెచ్ఓ డా.బి.రాజశ్రీ మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో RDT పరీక్షలు పెంచాలని, వివరాలను IHIP పోర్టల్లో ఎప్పటికప్పుడు నమోదు చేయాలని ఆదేశించారు. ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’లో భాగంగా వ్యాధుల నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.
News April 16, 2026
నిజామాబాద్: కీటక జనిత వ్యాధులపై నిఘా పెంచాలి – డీఎంహెచ్ఓ

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో మలేరియా, డెంగ్యూ వంటి కీటక జనిత వ్యాధుల నియంత్రణపై సమీక్ష నిర్వహించారు. డీఎంహెచ్ఓ డా.బి.రాజశ్రీ మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో RDT పరీక్షలు పెంచాలని, వివరాలను IHIP పోర్టల్లో ఎప్పటికప్పుడు నమోదు చేయాలని ఆదేశించారు. ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’లో భాగంగా వ్యాధుల నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.


