News March 16, 2025

NZB: 40 డిగ్రీలకు చేరువలో ఎండ

image

నిజామాబాద్ నగరంలో ఆదివారం మధ్యాహ్నం ఎండ 40 డిగ్రీలకు చేరువ చేరింది. దానికి తోడు వడ గాలులు కూడా వీస్తున్నాయి. దీనితో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. అత్యవసర పనుల మీద బయటకు వచ్చిన ప్రజలు వేడితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా ఇప్పుడే ఎండలు ఇలా ఉంటే రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందోనని భయపడుతున్నారు. కాగా గత ఏడాది ఇదే రోజు 34 డిగ్రీలుగా ఎండ నమోదైంది.

Similar News

News March 18, 2025

నాగన్ పల్లి పసుపు వాగులో గుర్తుతెలియని వ్యక్తి శవం

image

నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం నాగన్ పల్లి శివారులో గల పసుపు వాగులో సుమారు 40 నుంచి 50 ఏళ్ల వయసు గల మగ వ్యక్తి శవం లభ్యమైనట్టు పోలీసులు తెలిపారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు బోధన్ రూరల్ ఎస్సై మచ్చందర్ రెడ్డి వెల్లడించారు. మృతుడిని ఎవరైనా గుర్తించినట్లయితే బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ కోరారు.

News March 18, 2025

మహిళలను మోసం చేసిన రాష్ట్ర ప్రభుత్వం: MLC కవిత

image

మహిళలకు మోసం చేశామని ప్రభుత్వం అంగీకరించడం సిగ్గుచేటని ఎమ్మెల్సీ కవిత అన్నారు. సోమవారం హైదరాబాద్ అసెంబ్లీ ఆవరణలో ఆమె మహిళా వ్యతిరేక సీఎం రేవంత్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారని స్పష్టం చేశారు. స్వయంగా సీఎం అసెంబ్లీలో దురుసుగా మాట్లాడడమే కాకుండా స్వయంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయబోమని చెప్పకనే చెప్పారని ఆక్షేపించారు. కాంగ్రెస్ మెనిఫెస్టోలోని హామీలు విస్మరించిందని అన్నారు.

News March 18, 2025

నిజామాబాద్ : నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు

image

*NZB: ఇంటర్ పరీక్షలు.. 831 మంది గైర్హాజరు
*అభివృద్ధికి SDF కింద రూపాయలు 1000 కోట్లు ఇవ్వండి: ఆర్మూర్ MLA
*టూరిజం డెవలప్మెంట్ జరుగుతుంది: ఇన్చార్జ్ మంత్రి
*పసుపు రైతుల సమస్యలు ప్రస్తావించిన: బాల్కొండ ఎమ్మెల్యే
*టూరిజం అభివృద్ధి చేయాలి: ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి
*ఎడపల్లి: కుళ్లిన స్థితిలో మృతదేహం
*ఏర్గట్ల: WAY 2 NEWSతో GROUP-2 6వ ర్యాంకర్
*NZB: జలాల్పూర్ ఆలయాల్లో దొంగ చేతివాటం

error: Content is protected !!