News September 21, 2025
NZB: 65 వేలకుపైగా ఉద్యోగాలు కల్పించాం: TPCC చీఫ్

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 65 వేలకుపైగా ఉద్యోగాలు కల్పించినట్లు TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. శనివారం ఆయన గ్రంథాలయ నూతన భవనం, జిల్లా న్యాయస్థానానికి సంబంధించిన భవనాల కోసం ఓల్డ్ డీఈఓ కార్యాలయం సమీపంలోని ఖాళీ స్థలాన్ని పరిశీలించారు. అనంతరం లైబ్రరీలో నిరుద్యోగులతో మాట్లాడారు. తాజాగా ఆర్టీసీలో ఉద్యోగాల కోసం వెలువడిన నోటిఫికేషన్ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Similar News
News September 20, 2025
నిజామాబాద్: MLHPలకు ప్రాక్టికల్ పరీక్షలు

సీపీసీహెచ్లో భాగంగా మెడికల్ ల్యాబ్ హెల్త్ ప్రాక్టీషనర్ (MLHP)లకు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ రాజశ్రీ ఆధ్వర్యంలో ఇంటర్నల్, ఎక్స్టర్నల్, ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించారు. శిక్షణ పూర్తి చేసుకున్న 10 మంది MLHPలు హాజరయ్యారని చెప్పారు. మౌఖిక పరీక్షలో వారు చూపిన ప్రతిభ ఆధారంగా మార్కులను కేటాయించినట్లు తెలిపారు. ఎగ్జామినర్గా డాక్టర్ నిరూప్ రెడ్డి, ప్రోగ్రాం అధికారిగా డా.రాజు వ్యవహరించారు.
News September 20, 2025
NZB: అన్నదానం ట్రస్ట్కు రూ.1,01,116 విరాళం

ఎస్జీఎస్ పద్మావతి నిత్య అన్నదానం ట్రస్ట్కు రూ.1,01,116 PCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ విరాళం ప్రకటించారు. శనివారం గంగస్థాన్ ఫేజ్-2లోని ఉత్తర తిరుమల ఆలయంలో ఏర్పాటు చేసిన నిత్యాన్నదానం కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. అన్నదానం కన్నా గొప్ప దానం మరొకటి లేదన్నారు. దేవుడిని నమ్మే వ్యక్తుల్లో తాను మొదటివాడినని, దేవుని ఆశీస్సులతోనే నేను ఈ స్థాయికి చేరుకున్నానని పేర్కొన్నారు.
News September 20, 2025
నిజామాబాద్: భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలి: సీఎస్

జాతీయ రహదారుల నిర్మాణం, విస్తరణ కోసం భూసేకరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు కలెక్టర్లను ఆదేశించారు. శనివారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జాతీయ రహదారి పనులకు సంబంధించి జిల్లా వారీగా పెండింగ్లో ఉన్న భూసేకరణ అంశాలను చర్చించారు. భూములు కోల్పోయిన రైతులకు అందించాల్సిన పరిహారం, చెల్లింపుల గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నారు.