News March 13, 2025
NZB: 651 మంది విద్యార్థుల గైర్హాజరు

నిజామాబాద్ జిల్లాలో గురువారం నిర్వహించిన ఇంటర్ మొదటి సంవత్సరం మ్యాథ్స్, జువాలజీ, హిస్టరీ-1 పరీక్షకు మొత్తం 651 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని నిజామాబాద్ DIEO రవికుమార్ తెలిపారు. జిల్లాలో మొత్తం 18,197 మంది విద్యార్థులకు 17,546 మంది పరీక్షలకు హాజరయ్యారన్నారు. పరీక్షలు జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా జరిగాయని రవి కుమార్ వివరించారు.
Similar News
News March 15, 2025
NZB: గ్యాస్ స్టవ్ పేలి వాచ్మెన్ మృతి

నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్లో నాలుగేళ్లుగా వాచ్మెన్గా పని చేసే కోట్ల అనంత్(52) ఈ నెల 6న టీ పెట్టుకునేందుకు స్టవ్ ముట్టించగా ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని తీవ్రంగా గాయపడ్డారు. అప్పటి నుంచి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. శుక్రవారం చికిత్స పొందుతూ అనంత్ మృతి చెందినట్లు 4వ టౌన్ ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. మృతుడి స్వగ్రామం నిర్మల్ జిల్లా దిబ్బిడి గ్రామం అని పోలీసులు తెలిపారు.
News March 14, 2025
NZB: తల్లిని హత్య చేసిన కూతురు

నిజామాబాద్ నగరంలోని నాగారం 300 క్వార్టర్స్ దారుణం చోటుచేసుకుంది. ఓ కూతురు తన భర్తతో కలిసి కన్న తల్లిని హత్య చేసింది. స్థానికుల కథనం ప్రకారం.. బీడీ వర్కర్స్ కాలనీకి చెందిన విజయ(60) భర్త చనిపోగా కూతురు సౌందర్య, అల్లుడితో కలిసి ఉంటోంది. శుక్రవారం తన తల్లికి గుండెపోటు వచ్చి చనిపోయిందని సౌందర్య నమ్మించే ప్రయత్నం చేయగా విజయ గొంతుపై గాయాలు ఉండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
News March 14, 2025
నిజామాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు ఇలా..!

నిజామాబాద్ జిల్లాలో ఎండ తీవ్రత కొనసాగుతోంది. అత్యధికంగా లక్మాపూర్, మోస్రా, మగ్గిడి, ఎర్గట్ల ప్రాంతాల్లో 40.2℃ ఉష్ణోగ్రత నమోదైంది. అటు మల్కాపూర్, ఆలూర్, గోపన్నపల్లి, వెంపల్లె, తొండకూర్లో 40℃, మాచర్ల, మోర్తాడ్, నిజామాబాద్, మెండోరా 39.9, పోతంగల్, కోటగిరి 39.8, పెర్కిట్ 39.7, మంచిప్ప 39.6, నందిపేట 39.5, ఇస్సాపల్లె, ఎడపల్లె 39.4, బాల్కొండ, జానకంపేట్ 39.2, జక్రాన్పల్లి, కమ్మర్పల్లిలో 39.1℃గా నమోదైంది.