News February 24, 2025

NZB: BRSకు పోటీ చేసేందుకు అభ్యర్థి లేడు: CM

image

ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీఆర్ఎస్‌కు అభ్యర్థి దొరకలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. సోమవారం నిజామాబాద్‌లో నిర్వహించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ బిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలంటూ కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. కనీసం ఎన్నికల్లో పోటీకి అభ్యర్థి లేని ఆ పార్టీ తమ ప్రభుత్వాన్ని ఏ విధంగా పడగొడుతుందో ఆలోచించుకోవాలన్నారు.

Similar News

News March 24, 2025

NZB: యథావిధిగా పాఠశాలలు

image

ఈ నెల 25న అన్ని పాఠశాలలు యథావిధిగా ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు నిర్వహించాలని డీఈఓ అశోక్ తెలిపారు. పదో తరగతి పరీక్షల దృష్ట్యా ఎగ్జామ్ సెంటర్లు ఉన్న పాఠశాలలు మధ్యాహ్నం నుంచి నిర్వహిస్తుండగా 25న ఎస్ఎస్సీ పరీక్ష లేకపోవడంతో ఈ సవరణ చేసినట్లు తెలిపారు. అదే విధంగా పదో తరగతి పరీక్షల ఇన్విజిలేటర్ విధులు నిర్వర్తిస్తున్న వారు యథావిధిగా తమ పాఠశాలలకు వెళ్లాలని సూచించారు.

News March 24, 2025

NZB: ఇంగ్లీష్ పరీక్షకు 56 మంది గైర్హాజరు: డీఈవో

image

2025 పదో తరగతి వార్షిక పరీక్షల్లో భాగంగా సోమవారం జరిగిన ఇంగ్లీష్ పరీక్షకు 56 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ తెలిపారు. ఈ విద్యా సంవత్సరానికి జిల్లా వ్యాప్తంగా 22,735 మంది విద్యార్థులకు 22,679 మంది విద్యార్థులు హాజరయ్యారు. మరో 56 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డీఈవో అధికారికంగా వెల్లడించారు.

News March 24, 2025

ధర్పల్లి: ‘పది’ పరీక్ష రాయాలంటే రూ.5 వేలు ఇవ్వాల్సిందే

image

ధర్పల్లి మండలంలోని ఓ ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం అక్రమాలకు తెరలేపినట్లు విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు. పదో తరగతి పరీక్షల్లో కాపీ చేయాలంటే ఒక్కో విద్యార్థి రూ.5 వేలు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారని, తక్కువ ఇస్తే ఒప్పుకోవడం లేదని తల్లిదండ్రులు వాపోయారు. మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు మామూళ్లు ఇవ్వాలని పాఠశాల యాజమాన్యం డబ్బులు వసూలు చేస్తోందని ఆరోపించారు.

error: Content is protected !!