News March 6, 2025

NZB: BRS, కాంగ్రెస్‌కు ప్రజల చరమగీతం: MP

image

BRS, కాంగ్రెస్‌కు ప్రజలు చరమగీతం పాడారని నిజామాబాద్ BJP ఎంపీ ధర్మపురి అరవింద్ పేర్కొన్నారు. MLC ఎన్నికల్లో BJP గెలుపు నేపథ్యంలో ఆయన మాట్లాడారు. వచ్చే స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల్లో BJP విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 2028లో తెలంగాణలో BJPదే అధికారమని తెలిపారు. ఇక అన్ని ఎన్నికల్లోనూ స్వీప్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తామని పేర్కొన్నారు. MP వ్యాఖ్యలపై మీ కామెంట్?

Similar News

News October 20, 2025

NLG: టార్గెట్ రీచ్ అవుతారా..!

image

మద్యం షాపుల టెండర్లకు ప్రభుత్వం మరోసారి గడువు పొడిగించినా మద్యం వ్యాపారుల నుంచి అంతగా స్పందన కానరావడం లేదు. జిల్లాలో 154 మద్యం దుకాణాలకు సర్కారు ఆశించిన దానికంటే తక్కువ సంఖ్యలో (4,620) దరఖాస్తులు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గతేడాది 155 దుకాణాలకు 7,057 దరఖాస్తులు వచ్చాయి. ఎలాగైనా టార్గెట్ చేరుకోవాలనే సంకల్పంతో ఎక్సైజ్ శాఖ క్షేత్రస్థాయిలో పావులు కదుపుతోంది.

News October 20, 2025

విజయనగరం: పలు గ్రామాలకు రాకపోకలు బంద్

image

మెంటాడ మండలంలోని ఆండ్ర జలాశయం నుంచి 400 క్యూసెక్కుల నీరు విడుదల చేయడంతో చంపావతి నది పొంగిపొర్లుతుంది. దీంతో జగన్నాథపురం, చాకివలస, ఆగూరు, మల్లేడివలస, గూడెం, సారాడవలస, గజపతినగరం మండలంలోని మర్రివలసకు రాకపోకలు నిలిచిపోయాయి. ఆయా గ్రామాలకు బాహ్యప్రపంచంతో సత్సంబంధాలు తెగిపోయినట్లే. ఎవరికైనా ప్రాణాపాయమైతే రిస్క్ చేసి నది దాటడం, లేదా కిలోమీటర్ల దూరం పంటపొలాల్లో డోలీద్వారా రోగిని అష్టకష్టాలు పడి తరలించాలి.

News October 20, 2025

బాపట్ల: సిద్ధమవుతున్న ఆలయాలు

image

దీపావళి తర్వాత కార్తీకమాసం ప్రారంభం కానుంది. చాలామంది శైవక్షేత్రాలను దర్శించి దీపారాధన చేస్తుంటారు. ఇందులో భాగంగా బాపట్ల జిల్లాలోని శైవ క్షేత్రాలు సిద్ధమయ్యాయి. మల్లికార్జున స్వామి వారి దేవాలయం (మణికేశ్వరం), నగరేశ్వర స్వామి దేవాలయం (అద్దంకి), భవన నారాయణస్వామి దేవాలయం (బాపట్ల), జిల్లాలోని అన్ని శివాలయాల ఆలయాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు.