News March 6, 2025
NZB: BRS, కాంగ్రెస్కు ప్రజల చరమగీతం: MP

BRS, కాంగ్రెస్కు ప్రజలు చరమగీతం పాడారని నిజామాబాద్ BJP ఎంపీ ధర్మపురి అరవింద్ పేర్కొన్నారు. MLC ఎన్నికల్లో BJP గెలుపు నేపథ్యంలో ఆయన మాట్లాడారు. వచ్చే స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల్లో BJP విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 2028లో తెలంగాణలో BJPదే అధికారమని తెలిపారు. ఇక అన్ని ఎన్నికల్లోనూ స్వీప్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తామని పేర్కొన్నారు. MP వ్యాఖ్యలపై మీ కామెంట్?
Similar News
News November 27, 2025
భూపాలపల్లి: పంచాయతీ ఎన్నికలు.. మొదటి రోజు నామినేషన్లు ఎన్నంటే?

మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా భూపాలపల్లి జిల్లాలోని 4 మండలాలు గణపురం, కొత్తపల్లిగోరి, రేగొండ, మొగుళ్లపల్లిలో 82 గ్రామ పంచాయతీలకు 45 నామినేషన్లు దాఖలయ్యాయి. 712 వార్డులకు 35 నామినేషన్లు దాఖలైనట్లు జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ శర్మ తెలిపారు. ఏదైనా ఫిర్యాదులు చేయాలనుకుంటే 24 గంటలు పని చేసేలా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, 9030632608 నంబర్కు కాల్ చేయాలని ఆయన చెప్పారు.
News November 27, 2025
KNR: “ఆరోగ్య మహిళ” వైద్య పరీక్షలు తప్పనిసరి: కలెక్టర్

జిల్లాలోని మహిళల సంపూర్ణ ఆరోగ్యం కోసం నిర్వహిస్తున్న ఆరోగ్య మహిళా ఉచిత వైద్య పరీక్షలను మహిళలంతా సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కరీంనగర్ టీఎన్జీవో సంఘ భవనంలో ఎన్జీవోల సంఘం, జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగగా, కలెక్టర్ హాజరై ఆరోగ్య పరీక్షలను పరిశీలించారు. సుమారు రూ.50 వేల విలువచేసే 45 రకాల పరీక్షలు ఈ కార్యక్రమం ద్వారా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
News November 27, 2025
విద్యార్థులకు సైన్స్పై ఆసక్తి పెంచాలి: భూపాలపల్లి కలెక్టర్

విద్యార్థుల్లో సైన్స్ పై ఆసక్తిని పెంపొందించడంతోపాటు నాణ్యమైన విజ్ఞాన విద్యను అందించేందుకు ప్రథం ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్టెమ్ ఎడ్యుకేషన్ ఫర్ ఇన్నోవేషన్ కార్యక్రమాన్ని అన్ని పాఠశాలల్లో అమలు చేయనున్నట్లు కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. విద్యార్థులకు సైన్స్ అంశాలపై అవగాహన పెంచేలా ఆన్లైన్ వీడియోలు, టీచర్లకు ప్రత్యేక గైడెన్స్, స్టెమ్ బోధన అలాగే ఫౌండేషన్ అందించే సామగ్రి అన్ని పాఠశాలలకు చేరాలన్నారు.


