News March 6, 2025
NZB: BRS, కాంగ్రెస్కు ప్రజల చరమగీతం: MP

BRS, కాంగ్రెస్కు ప్రజలు చరమగీతం పాడారని నిజామాబాద్ BJP ఎంపీ ధర్మపురి అరవింద్ పేర్కొన్నారు. MLC ఎన్నికల్లో BJP గెలుపు నేపథ్యంలో ఆయన మాట్లాడారు. వచ్చే స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల్లో BJP విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 2028లో తెలంగాణలో BJPదే అధికారమని తెలిపారు. ఇక అన్ని ఎన్నికల్లోనూ స్వీప్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తామని పేర్కొన్నారు. MP వ్యాఖ్యలపై మీ కామెంట్?
Similar News
News November 27, 2025
సిరిసిల్ల: ‘జిల్లాను ప్రథమ స్థానంలో ఉండేలా చూడాలి’

ఆరోగ్య పథకాలు 100% సాధించాలని సిరిసిల్ల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రజిత అన్నారు. సిరిసిల్లలో ఆరోగ్య పథకాలపై అధికారులతో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆరోగ్య పథకాలు సాధించి జిల్లాను ప్రథమ స్థానంలో ఉండేలా చూడాలని అధికారులు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు రామకృష్ణ, అనిత, నహిమ, సిబ్బంది పాల్గొన్నారు.
News November 27, 2025
తెలంగాణ రైజింగ్-2047 పాలసీ డాక్యుమెంట్పై సీఎం రేవంత్ సమీక్ష

TG: తెలంగాణ రైజింగ్-2047 పాలసీ డాక్యుమెంట్పై సమీక్షించిన సీఎం రేవంత్ అధికారులకు పలు సూచనలు చేశారు. ‘ఆర్థికాభివృద్ధిని మూడు రీజియన్లుగా విభజించి అభివృద్ధి చేసుకోవాలి. కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ, పెరీ అర్బన్ రీజియన్ ఎకానమీ, రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీగా విభజించుకోవాలి. రాష్ట్రంలో పాలసీ పెరాలసిస్ ఉండదని చాటి చెప్పేలా తెలంగాణ రైజింగ్ పాలసీ డాక్యుమెంట్ ఉండాలి’ అని తెలిపారు.
News November 27, 2025
గుంతకల్లు: రాష్ట్ర స్థాయిలో సత్తా చాటిన రాజేశ్

గుంతకల్లు పట్టణంలోని ఓ కాలేజీలో చదువుతున్న ఇంటర్ విద్యార్థి రాజేశ్ వినుకొండలో జరిగిన రాష్ట్ర స్థాయి పరుగు పందెం పోటీలలో పాల్గొని 200, 400, 4×1000 పోటీలలో ప్రథమ స్థానం సాధించి లక్నోలో నిర్వహించే జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాజేశ్ జాతీయ పోటీలకు ఎంపికై కళాశాలకు పేరు తెచ్చారని అభినందించారు.


