News March 6, 2025

NZB: BRS, కాంగ్రెస్‌కు ప్రజల చరమగీతం: MP

image

BRS, కాంగ్రెస్‌కు ప్రజలు చరమగీతం పాడారని నిజామాబాద్ BJP ఎంపీ ధర్మపురి అరవింద్ పేర్కొన్నారు. MLC ఎన్నికల్లో BJP గెలుపు నేపథ్యంలో ఆయన మాట్లాడారు. వచ్చే స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల్లో BJP విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 2028లో తెలంగాణలో BJPదే అధికారమని తెలిపారు. ఇక అన్ని ఎన్నికల్లోనూ స్వీప్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తామని పేర్కొన్నారు. MP వ్యాఖ్యలపై మీ కామెంట్?

Similar News

News December 17, 2025

శ్రీరాంపూర్: సింగరేణి ఇన్‌చార్జి సీఅండ్‌ఎండీగా కృష్ణ భాస్కర్

image

సింగరేణి సంస్థ ఇన్‌చార్జి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఅండ్‌ఎండీ)గా కృష్ణ భాస్కర్ నియమితులైనట్లు సమాచారం. 2012 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన కృష్ణ భాస్కర్ ప్రస్తుతం ట్రాన్స్‌కో సీఅండ్‌ఎండీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సింగరేణి సీఅండ్‌ఎండీగా ఆయనను ప్రభుత్వం నియమించినట్లు తెలిసింది. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు ఇంకా వెలువడాల్సి ఉంది.

News December 17, 2025

సింగరేణి సీఎండీగా కృష్ణ భాస్కర్ బాధ్యతల స్వీకరణ

image

సింగరేణి సంస్థ సీఎండీగా దేవరకొండ కృష్ణ భాస్కర్ నియమితులయ్యారు. ప్రస్తుత సీఎండీ ఎన్.బలరామ్ ఏడేళ్ల డిప్యూటేషన్ అనంతరం మాతృ విభాగానికి తిరిగి వెళుతున్న నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. కృష్ణ భాస్కర్ మంగళవారం సింగరేణి భవన్‌లో బలరామ్ నుంచి బాధ్యతలు స్వీకరించారు. సింగరేణి డైరెక్టర్లు, జనరల్ మేనేజర్లు నూతన సీఎండీకి స్వాగతం పలికారు.

News December 17, 2025

ఐపీఎల్‌లో తెనాలి కుర్రాడు.. గుజరాత్ గూటికి పృథ్వీరాజ్

image

ఐపీఎల్ వేలంలో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన యువ క్రికెటర్ యర్రా పృథ్వీరాజ్ మెరిశాడు. ఎడమచేతి వాటం పేసర్ అయిన పృథ్వీరాజ్‌ను ‘గుజరాత్ టైటాన్స్’ జట్టు దక్కించుకుంది. వేలంలో అతన్ని రూ.30 లక్షల ధరకు గుజరాత్ ఫ్రాంచైజీ కొనుగోలు చేసింది. గతంలో కోల్‌కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ జట్ల తరఫున ఉన్న పృథ్వీరాజ్.. ఇప్పుడు గుజరాత్ తరఫున బరిలోకి దిగనున్నాడు. దీంతో తెనాలి వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.