News March 17, 2024

NZB: నలుగురు కాంగ్రెస్ నాయకులకు కార్పొరేషన్ పదవులు

image

కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించిన వివిధ కార్పొరేషన్ పదవుల్లో NZB జిల్లా బాల్కొండ నియోజకవర్గం నుంచి ముగ్గురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పదవులు పొందారు. అనిల్ ఈరవత్రి (మినరల్ డెవలప్‌మెంట్), మానాల మోహన్ రెడ్డి(కో ఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్), అన్వేశ్ రెడ్డి(సీడ్స్ డెవలప్‌మెంట్). వీరితో పాటు కామారెడ్డి జిల్లా నుంచి కాసుల బాలరాజు (ఆర్గో ఇండస్ట్రీస్) లభించింది.

Similar News

News January 24, 2026

NZB: మున్సిపల్ ఎన్నికలు.. కలెక్టర్ కీలక ఆదేశాలు

image

మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో నోడల్ అధికారులు పూర్తి బాధ్యతతో, సమర్థవంతంగా విధులు నిర్వహించాలని నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో ఎన్నికల సన్నద్ధతపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా, కేటాయించిన పనులను సకాలంలో పూర్తి చేయాలన్నారు. అన్ని ఏర్పాట్లతో ముందస్తుగానే సిద్ధంగా ఉండాలని, ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా చూడాలని సూచించారు.

News January 24, 2026

దివ్యాంగులకు త్వరగా ‘ఆసరా’ పెన్షన్లు: కలెక్టర్

image

అర్హులైన దివ్యాంగులకు త్వరితగతిన ఆసరా పెన్షన్లు మంజూరయ్యేలా కృషి చేస్తామని కలెక్టర్ ఇలా త్రిపాఠి హామీ ఇచ్చారు. శనివారం ఆమె మాట్లాడుతూ.. పిల్లల తల్లిదండ్రులు అవసరమైన ధ్రువపత్రాలను సిద్ధం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘భవిత’ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లల సంక్షేమానికి జిల్లా యంత్రాంగం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

News January 24, 2026

దివ్యాంగ పిల్లలకు పథకాలు అందేలా చూడాలి: జిల్లా జడ్జి

image

ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు ప్రభుత్వ పథకాలు అందేలా అధికారులు చొరవ చూపాలని నిజామాబాద్ జిల్లా జడ్జి భరతలక్ష్మి సూచించారు. శనివారం జిల్లా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ‘సదరం’ శిబిరాన్ని ఆమె కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి పరిశీలించారు. న్యాయ సేవాధికార సంస్థ, డీఆర్డీఏ, విద్యాశాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరం ద్వారా అర్హులకు లబ్ధి చేకూర్చాలని అధికారులను ఆదేశించారు.