News October 20, 2024

NZB: GGHలో కిడ్నాప్.. మహారాష్ట్రలో లభ్యం

image

నిజామాబాద్ GGHలో కిడ్నాప్ అయిన బాలుడి ఆచూకీని పోలీసులు కనిపెట్టారు. మద్నూర్‌కు చెందిన పిట్ల రాజు, లక్ష్మి దంపతులు శుక్రవారం రాత్రి ఆస్పత్రి ఆవరణలో నిద్రించగా వారి కుమారుడు మణికంఠను ముగ్గురు మహిళలు ఎత్తుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితులు మహారాష్ట్రకు వెళ్లినట్లు గుర్తించారు. ప్రత్యేక బృందంతో మహారాష్ట్రకు వెళ్లి నిందితులను, బాలుడిని గుర్తించారు.

Similar News

News December 23, 2025

NZB: మాతాశిశు సంరక్షణకు అంకిత భావంతో కృషి చేయాలి: కలెక్టర్

image

మాతా శిశు సంరక్షణే ధ్యేయంగా వైద్యులు, సిబ్బంది అంకిత భావంతో కృషి చేయాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. ప్రసవాల సందర్భంగా మాతాశిశు మరణాలు చోటుచేసుకోకుండా ముందస్తుగానే క్రమం తప్పకుండా వైద్య సేవలు అందిస్తూ, నిశిత పర్యవేక్షణ జరపాలని అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో మంగళవారం కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి మాతా శిశు మరణాల నిరోధక కమిటీ సమావేశం జరిగింది.

News December 23, 2025

నూతన పద్ధతుల ద్వారా కేసుల పరిష్కారానికి కృషి: అదనపు డీసీపీ

image

శాస్త్ర సాంకేతిక నూతన పద్ధతుల ద్వారా కేసుల పరిష్కారానికి కృషి చేయాలని నిజామాబాద్ అదనపు డీసీపీ (అడ్మిన్) బస్వారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం పోలీస్ స్టేషన్ రైటర్స్ శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. కేసుల పరిశోధనలో నాణ్యతను పెంచి FIR నుంచి అంతిమ రిపోర్ట్ వరకు ఉండవలసిన మెలుకువల గురించి క్షుణ్ణంగా వివరించారు. సైబర్ క్రైమ్ ఏసీపీ వెంకటేశ్వర్ రావు,టౌన్ సీఐ శ్రీనివాస్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.

News December 22, 2025

UPDATE: 9 నెలల బాబు విక్రయం కేసులో ఐదుగురి అరెస్ట్

image

NZBలో 9 నెలల బాబును విక్రయించిన సంఘటన తెలిసిందే. ఈ సంఘటనలో ఐదుగురిని అరెస్ట్ చేసినట్లుNZB వన్ టౌన్ SHO రఘుపతి ఆదివారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు.. KMRకు చెందిన సీమ, షరీఫ్ NZB రైల్వే స్టేషన్ వద్ద 9 నెలల బాబుతో భిక్షాటన చేస్తూ బాబును విక్రయించారు. వారిద్దరితో పాటు మధ్యవర్తులుగా ఉండి బాబును విక్రయించిన రెహనా బేగం, సర్ తాజ్ అన్సారీ తో పాటు కొనుగోలు చేసిన సలావుద్దీన్ ఖురేషీని అరెస్ట్ చేశామన్నారు.