News April 1, 2025
NZB: IIIT విద్యార్థి ఆత్మహత్య.. కాశీలో అంత్యక్రియలు

వర్ని మండలం సత్యనారాయణపురం గ్రామానికి చెందిన <<15944978>>రాహుల్ చైతన్య(18) అలహాబాద్ IIITలో ఆత్మహత్య చేసుకున్న<<>> విషయం తెలిసిందే. కాగా రాహుల్ చైతన్య అలహాబాద్ IIITలో బీటెక్ చేస్తున్నాడు. ఆదివారం తెల్లవారుజామున భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. రాహుల్ చైతన్య అంత్యక్రియలను కాశీలో నిర్వహించారు.
Similar News
News November 20, 2025
నాంపల్లి కోర్టులో ముగిసిన జగన్ విచారణ

HYD నాంపల్లి సీబీఐ కోర్టులో YCP అధినేత జగన్ విచారణ ముగిసింది. కోర్టులో ఆయన 5 నిమిషాలు మాత్రమే కూర్చున్నారు. వ్యక్తిగతంగా హాజరైనట్లు కోర్టు రికార్డులో నమోదు చేసింది. విచారణ అనంతరం ఆయన కోర్టు నుంచి బయటకు వచ్చారు. కాసేపట్లో లోటస్ పాండ్లోని తన నివాసానికి వెళ్లనున్నారు. విదేశీ పర్యటన పిటిషన్కు సంబంధించి జగన్ కోర్టుకు హాజరయ్యారని, ఛార్జ్షీట్లకు సంబంధించి ఎలాంటి విచారణ జరగలేదని ఆయన లాయర్ తెలిపారు.
News November 20, 2025
నంద్యాల జిల్లా అభివృద్ధికి సమన్వయం అవసరం: ఎంపీ శబరి

నంద్యాల జిల్లా అభివృద్ధికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని నంద్యాల ఎంపీ, జిల్లా అభివృద్ధి సమన్వయ & పర్యవేక్షణ కమిటీ ఛైర్మన్ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు. జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆధ్వర్యంలో గురువారం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆమె అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో జడ్పీ ఛైర్మన్ పాపిరెడ్డి, సీఈఓ తదితరులు పాల్గొన్నారు.
News November 20, 2025
పెద్దపల్లి: పల్లె పోరుకు సిద్ధమా…?

స్థానిక సంస్థల ఎన్నికల పోరు సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కోసం ఆశావహులు అంతంత మాత్రమే అన్నట్లుగా గ్రామంలో వాతావరణం నెలకొంది. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా 13 జడ్పీటీసీ, 138 ఎంపీటీసీ, 263 పంచాయతీలు, 2,474 వార్డు స్థానాలు ఉన్నాయి. ముందుగా సర్పంచ్ ఎన్నికలు జరిగేతే, ఈ ఎన్నికల్లో నాయకులు ఓడితే ఎంపీటీసీ ఎన్నికల్లో నాయకులు వారి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.


