News April 1, 2025

NZB: IIIT విద్యార్థి ఆత్మహత్య.. కాశీలో అంత్యక్రియలు

image

వర్ని మండలం సత్యనారాయణపురం గ్రామానికి చెందిన <<15944978>>రాహుల్ చైతన్య(18) అలహాబాద్ IIITలో ఆత్మహత్య చేసుకున్న<<>> విషయం తెలిసిందే. కాగా రాహుల్ చైతన్య అలహాబాద్ IIITలో బీటెక్ చేస్తున్నాడు. ఆదివారం తెల్లవారుజామున భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. రాహుల్ చైతన్య అంత్యక్రియలను కాశీలో నిర్వహించారు.

Similar News

News December 26, 2025

రామచంద్రపురంలో విజిలెన్స్ కమిటీ సమీక్ష.. ఎస్సీ, ఎస్టీ కేసులపై ఆరా!

image

రామచంద్రపురంలో శుక్రవారం సబ్ డివిజనల్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఆర్డీఓ అఖిల, డీఎస్పీ రఘువీర్ అధికారులతో కలిసి ఎస్సీ, ఎస్టీ కేసులు, వసతి గృహాల నిర్వహణ, ట్రాఫిక్ సమస్యలపై సమీక్షించారు. బాధితులకు న్యాయం చేయడంలో జాప్యం వహించరాదని, సమస్యల పరిష్కారానికి పక్కా ప్రణాళికలతో ముందుకెళ్లాలని అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పట్ల యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.

News December 26, 2025

పీఆర్సీ ప్రకటించకపోతే మారో ఉద్యమం: UTF

image

రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పీఆర్సీని ప్రకటించి అమలు చేయాలని, లేనిపక్షంలో మరో ఉద్యమానికి సిద్ధమని యూటీఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి హెచ్చరించారు. శుక్రవారం సిద్దిపేటలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 2023 జూలై 1 నుంచి పీఆర్సీని వర్తింపజేయాలని, పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈనెల 28, 29న జరిగే మహాసభలను ఉపాధ్యాయులందరూ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

News December 26, 2025

శ్రీకాకుళం: పెరిగిన కోడి గుడ్డు ధర ఎంతంటే !

image

ఎన్నడూ లేని విధంగా కోడిగుడ్ల ధరలు భారీగా పెరిగాయి. రూ.8 ఉన్న గుడ్డు ధర రూ.10కి చేరింది. హోల్సేల్ మార్కెట్లోనే ఒక్కో గుడ్డు రూ.9.30 పలుకుతోంది. ప్రస్తుతం ఒక ట్రే రూ.270 నుంచి రూ.290కి చేరింది. క్రిస్మస్, న్యూఇయర్ కారణంగా ఎగుమతులు పెరగటంతో ఈ పరిస్థితి ఏర్పడిందని వ్యాపారులు చెబుతున్నారు. ఎన్నడూ లేని విధంగా గుడ్ల ధరలు రికార్డు స్థాయికి చేరడంతో వినియోగదారులు ఆందోళన పడుతున్నారు.