News March 6, 2025

NZB: MLC ఎన్నికలు.. ఎవరికి ఎన్ని ఓట్లంటే..?

image

ఉమ్మడి కరీంనగర్, మెదక్, అదిలాబాద్, నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి విజయం సాధించిన విషయం తెలిసిందే. రెండో ప్రాధాన్యత ఓట్లతో బీజేపీ నుంచి పోటీ చేసిన అంజిరెడ్డి 98,637 ఓట్లతో విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన నరేందర్ రెడ్డికి 93,531 ఓట్లు వచ్చాయి. బీఎస్పీ నుంచి పోటీ చేసిన ప్రసన్న హరికృష్ణకు 63,972 ఓట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

Similar News

News January 9, 2026

మహిళలూ.. ఈ లక్షణాలున్నాయా? జాగ్రత్త

image

క్యాన్సర్ లక్షణాలు అన్నిసార్లూ బయటకు కనిపించవు. ముఖ్యంగా మహిళల్లో కొన్ని క్యాన్సర్లు నిశ్శబ్ధంగా శరీరంలో వ్యాపిస్తాయంటున్నారు నిపుణులు. చాలా క్యాన్సర్లను ప్రారంభదశలో గుర్తించడం కష్టమని చెబుతున్నారు. అందుకే మహిళల్లో అసాధారణ వాపు, దీర్ఘకాల అలసట, కారణం లేకుండా బరువు తగ్గడం, చర్మంపై మార్పులు, అసాధారణ రక్తస్రావం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.

News January 9, 2026

AIIMS పట్నాలో 117 పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

image

AIIMS పట్నాలో 117 సీనియర్ రెసిడెంట్(నాన్ అకడమిక్) పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి MBBS/MD/MS/DNB/DM/M.Ch ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 45ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. షార్ట్ లిస్టింగ్, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://api.aiimspatna.edu.in/

News January 9, 2026

మేడారం భక్తుల కానుకలు.. భద్రమేనా..!?

image

మేడారం జాతరలో హుండీలో భక్తుల కానుకలకు ఈసారైనా దేవదాయ శాఖ అధికారులు భద్రత కల్పిస్తారా? అని భక్తులు ప్రశ్నిస్తున్నారు. గత మేడారం జాతరలో అనుకోకుండా కురిసిన భారీ వర్షానికి జాతరలో ఏర్పాటు చేసిన హుండీలకు వర్షపు నీరు చేరి భక్తులు వేసిన బియ్యం, నోట్ల కాగితాలు, ఇతర కానుకలు తడిసి ముద్దయ్యాయి. లక్షల రూపాయలు బూజు పట్టి పనికిరాకుండా పోయాయి. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈసారైనా అధికారులు చర్యలు తీసుకోవాలి.