News March 30, 2024

NZB: SRSP వద్ద విదేశీ పక్షుల సందడి

image

నిజామాబాద్ జిల్లా బాల్కొండ శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకి పక్షుల రాక మొదలైంది.  ప్రతి ఏడాది వేసవిలో విదేశాల నుంచి అరుదైన పక్షులు నీటి కోసం బ్యాక్ వాటర్ ప్రాంతానికి వస్తుంటాయి. దాదాపు మూడు నెలల పాటు అవి ఇక్కడ ఉంటాయి. వాటిని చూసేందుకు పర్యాటకులు భారీగా వస్తుంటారు. ముఖ్యంగా ఛాయ చిత్రకారులు వాటిని కెమెరాల్లో బంధించేందుకు ఆసక్తి చూపుతారు.

Similar News

News April 23, 2025

NZB: ప్రభుత్వ కళాశాలల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థినులు

image

ప్రభుత్వ జూనియర్ కళాశాలలలో విద్యార్థినులు అత్యధిక మార్కులు సాధించారని నిజామాబాద్ జిల్లా ఇంటర్ విద్యా అధికారి రవికుమార్ తెలిపారు. నిజామాబాద్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఎంపీసీలో బి.జ్యోతిర్మయి 956, బైపీసీలో మలిహ ఆర్ఫీన్ 974, బైపీసీ ఉర్దూ మీడియంలో 963 మార్కులు, ఒకేషనల్ ఎస్. పూజ 974 మార్కులు సాధించారని చెప్పారు.

News April 23, 2025

NZB: బీసీ గురుకుల జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలు

image

బీసీ గురుకుల జూనియర్ కాలేజీల్లో మొదటి సంవత్సరం ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది. వచ్చే నెల 12వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా 130 కాలేజీలు బాలురకు 127 కాలేజీలు బాలికలకు ఉన్నాయి. మరిన్ని వివరాలకు https://mjpabcwreis.cgg.gov.in/ TSMJBCWEB/లేదా 040-23328266 నంబర్‌ను సంప్రదించగలరు.

News April 23, 2025

NZB: తల్లికి క్యాన్సర్.. కొడుకు ఆత్మహత్య

image

తల్లి క్యాన్సర్‌తో బాధపడుతూ ఉండటంతో మనస్తాపం చెందిన కొడుకు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన డిచ్‌పల్లిలో మంగళవారం వెలుగు చూసింది. ఎస్ఐ షరీఫ్ తెలిపిన వివరాల ప్రకారం.. కమలాపూర్ గ్రామానికి చెందిన కర్రినోల్ల భూలక్ష్మి కొన్ని సంవత్సరాలుగా కాన్సర్‌తో పడపడుతుంది. ఇది జీర్ణించుకోలేక కొడుకు రంజిత్(28) ఈ నెల 21న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు పోలీసులు వివరించారు.

error: Content is protected !!