News March 12, 2025
NZB: SSC పరీక్షల నిర్వాణపై డీఈఓ పరిచయ కార్యక్రమం

రానున్న SSC పరీక్షల నిర్వహణ, విద్యార్థుల సన్నద్ధత సహా పలు కీలక అంశాలపై జిల్లా విద్యాశాఖ అధికారి పార్శి అశోక్తో బుధవారం ఉదయం 7:50 నిమిషాలకు ఆకాశవాణి నిజామాబాద్ (103.2 M.Htz) లేదా “News On AIR” మొబైల్ యాప్ ద్వారా ప్రసారం కానుందని అధికారులు తెలిపారు. జిల్లాలోని అన్ని యాజమాన్యాల విద్యార్థులు, ఉపాధ్యాయులు ఈ కార్యక్ర ఉద్దేశాన్ని అవగాహన చేసుకొని తగు సూచనలు ఇవ్వాలని డీఈవో అశోక్ కోరారు.
Similar News
News March 12, 2025
NZB: గ్రూప్-2లో BC(A) విభాగంలో SIకి స్టేట్ ఫస్ట్ ర్యాంక్

నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి ఏడవ బెటాలియన్ రిజర్వ్డ్ ఎస్సై BC(A) లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించారు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం, లింగాపూర్ గ్రామానికి చెందిన వరంగంటి అశోక్ నాలుగేళ్లుగా డిచ్పల్లి ఏడవ బెటాలియన్లో SIగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే నిన్న విడుదలైన గ్రూప్-2 ఫలితాల్లో బీసీఏలో స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించారు.
News March 12, 2025
ఆర్మూర్: గ్రూప్స్ ఫలితాలలో సత్తా చాటిన పెర్కిట్ వాసి

ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ ప్రాంతానికి చెందిన రామ్ కిషోర్ గ్రూప్స్ ఫలితాల్లో సత్తా చాటారు. రాష్ట్రస్థాయిలో గ్రూప్-2 ఫలితాలలో 136వ ర్యాంక్ సాధించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ విధులు నిర్వహిస్తున్నారని తల్లిదండ్రులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు శుభాకాంక్షలు తెలియజేసి అభినందించారు.
News March 12, 2025
NZB: అసెంబ్లీ రోజున ప్రజాప్రతినిధుల అరెస్టులా?: కవిత

అసెంబ్లీ రోజున ప్రజాప్రతినిధుల అరెస్టులా? అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత X వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పెండింగ్ బిల్లులు విడుదల చేయాలంటూ ప్రజాస్వామ్య పద్దతిలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తమ గోడు చెప్పుకునేందుకు హైదరాబాద్ వస్తున్న తాజా మాజీ సర్పంచ్లను రాష్ట్ర వ్యాప్తంగా అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నమన్నారు. సర్పంచ్లను కలిసేందుకు సీఎం ఎందుకు భయపడుతున్నారన్నారు.