News March 18, 2024
NZB: జంట హత్యలు.. నిందితుడు సూసైడ్

ఆర్మూర్లోని విద్యానగర్ కాలనీలో చేపూర్ గ్రామానికి చెందిన బండి నడిపి గంగాధర్ అనే వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు గతంలో నగల కోసం ఇద్దరూ అక్కాచెల్లెళ్లను హతమార్చిన ఘటనలో నిందితుడు కావడం విశేషం. మృతుడి ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అప్పటినుంచి మతిస్థిమితం లేదని మృతుడి బంధువులు తెలిపినట్లు పోలీసులు వెల్లడించారు.
Similar News
News February 3, 2026
నిజామాబాద్లో లెక్క తేలింది.. బరిలో 350 మంది..!

నిజామాబాద్ నగరపాలక సంస్థ ఎన్నికల నామినేషన్ల ఉప సంహరణ గడువు మంగళవారం సాయంత్రంతో ముగియగా 60 వార్డులకు గాను 350 మంది పోరు బరిలో నిలిచారు. ఇందులో BJP నుంచి 52 , కాంగ్రెస్ నుంచి 62, BRS నుంచి 59, AIMIM నుంచి 25, AIFB నుంచి 15, BSP నుంచి 3, JSP నుంచి 11, AAP నుంచి 1, CPM నుంచి 3, CPI నుంచి 2, ఇతర రిజిస్టర్డ్ పార్టీలు 17మంది , స్వతంత్ర అభ్యర్థులు 100 మంది బరిలో ఉన్నట్లు అధికారులు తెలిపారు.
News February 3, 2026
NZB: పోలింగ్ విధులపై అవగాహన

మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 11న చేపట్టనున్న పోలింగ్ ప్రక్రియపై ప్రిసైడింగ్ అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని అదనపు కలెక్టర్ అంకిత్, ఎన్నికల పరిశీలకులు సీహెచ్. సత్యనారాయణ రెడ్డి సూచించారు. ఎలాంటి సందేహాలు ఉన్నా, ముందుగానే నివృత్తి చేసుకోవాలని హితవు పలికారు.
హ్యాండ్ బుక్లో పొందుపర్చిన అంశాలను క్షుణ్ణంగా చదివి పోలింగ్ విధులపై స్పష్టమైన అవగాహన ఏర్పర్చుకోవాలని అన్నారు.
News February 3, 2026
NZB: సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, సీపీ

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 6న నిజామాబాద్ జిల్లా పర్యటనకు హాజరు కానున్న నేపథ్యంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి, పొలీస్ కమిషనర్ పి.సాయిచైతన్య జిల్లా అధికారులతో కలిసి మంగళవారం ఏర్పాట్లను పరిశీలించారు. NZB బైపాస్ రోడ్డుకు ఆనుకుని ఉన్న ప్రాంతాన్ని CM సభా స్థలిగా ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో కలెక్టర్, CP క్షేత్రస్థాయిలో ఆ ప్రాంతాన్ని సందర్శించి ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు.


