News February 5, 2025

NZB: UPDATE.. రైలు నుంచి పడిన మృతుడి గుర్తింపు: SI

image

నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం సిర్నాపల్లి – ఉప్పల్వాయి స్టేషన్‌ల మధ్య రైలు నుంచి జారి పడి నిన్న సాయంత్రం ఒకరు మృతి చెందిన సంగతి తెలిసిందే. కాగా మృతుడిని మేడ్చల్ కు చెందిన చిట్యాల భూంరెడ్డి (80) గా గుర్తించినట్లు నిజామాబాద్ రైల్వే ఎస్ఐ సాయిరెడ్డి తెలిపారు. మృతుడు ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ రైల్లో నుంచి జారి పడినట్లు ఎస్ఐ వివరించారు.

Similar News

News February 15, 2025

దుగ్గొండి: ‘ఈజీఎస్ పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు’

image

జాతీయ గ్రామీణ ఉపాధి పనుల్లో పారదర్శకత లోపిస్తే చర్యలు తీసుకుంటామని డీఆర్డీవో కౌసల్యాదేవి తెలిపారు. దుగ్గొండిలో ఉపాధి హామీ 2023-24 వార్షిక సంవత్సరంలో చేపట్టిన పనులపై మండల స్థాయి సామాజిక ప్రజా వేదికను శుక్రవారం నిర్వహించారు. గ్రామాల వారీగా చేపట్టిన పనులపై ఈజీఎస్, పంచాయతీ అధికారులు సభలో చదివి వినిపించారు. ఎంపీడీవో అరుంధతి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

News February 15, 2025

IMLT20 టోర్నీకి భారత జట్టు ఇదే

image

ఇంటర్నేషనల్ మాస్టర్స్ టీ20 లీగ్‌లో ఆడే భారత జట్టుకు సచిన్ టెండూల్కర్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. మాజీ క్రికెటర్లు పాల్గొనే ఈ టోర్నీ ఈనెల 22న నవీ ముంబైలో భారత్VSశ్రీలంక మ్యాచుతో ప్రారంభం కానుంది.

భారత జట్టు: సచిన్, యువరాజ్, రైనా, రాయుడు, Y పఠాన్, ఇర్ఫాన్ పఠాన్, బిన్నీ, కులకర్ణి, వినయ్ కుమార్, నదీమ్, రాహుల్ శర్మ, పవన్ నేగి, నమన్ ఓజా, గుర్‌కీరత్, అభిమన్యు మిథున్.

News February 15, 2025

నల్గొండ: నేడు జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు

image

నల్లగొండ పోలీస్ శాఖ, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ ఆధ్వర్యంలో మిషన్ పరివర్తన్ యువతేజం కార్యక్రమంలో భాగంగా శనివారం మధ్యాహ్నం ఎన్జీ కళాశాలలో మధ్యాహ్నం 3.00 గంటల నుంచి రాత్రి 8.00 గంటల వరకు జిల్లా స్థాయి కబడ్డీ పోటీలను నిర్వహించినట్లు ఎస్పీ కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది. క్రీడాభిమానులంతా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని తెలిపారు.

error: Content is protected !!