News March 26, 2025

NZB: ఆస్తి పన్ను చెల్లింపు కోసం వన్‌టైం సెటిల్మెంట్: కలెక్టర్

image

ఆస్తి పన్ను బకాయిల చెల్లింపులపై రాయితీ సదుపాయాన్ని వర్తింపజేస్తూ ప్రభుత్వం వన్ టైం సెటిల్మెంట్‌ను అమలు చేస్తోందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ఆస్తి పన్ను బకాయి ఉన్న వారు నిర్ణీత గడువు లోపు ఒకే విడతలో బకాయిలు చెల్లిస్తే, 90 శాతం వడ్డీ మాఫీ వర్తిస్తుందని అన్నారు. నిజామాబాద్ నగర పాలక సంస్థతో పాటు బోధన్, ఆర్మూర్, భీంగల్ మున్సిపాలిటీల పరి ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Similar News

News April 1, 2025

NZB: IIIT విద్యార్థి ఆత్మహత్య.. కాశీలో అంత్యక్రియలు

image

వర్ని మండలం సత్యనారాయణపురం గ్రామానికి చెందిన <<15944978>>రాహుల్ చైతన్య(18) అలహాబాద్ IIITలో ఆత్మహత్య చేసుకున్న<<>> విషయం తెలిసిందే. కాగా రాహుల్ చైతన్య అలహాబాద్ IIITలో బీటెక్ చేస్తున్నాడు. ఆదివారం తెల్లవారుజామున భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. రాహుల్ చైతన్య అంత్యక్రియలను కాశీలో నిర్వహించారు.

News April 1, 2025

నిజామాబాద్ జిల్లాలో భానుడి భగభగ

image

నిజామాబాద్ జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి.. మోస్రాలో 41.5℃, ఎడపల్లి 41.4, పెర్కిట్ 41.4, కోటగిరి 41.4, నిజామాబాద్ 41.3, గోపన్నపల్లి 41.3, వేంపల్లి 41.2, వైల్పూర్ 41.1, మెండోరా 41.1, ధర్పల్లి 41, మగ్గిడి 40.9, మోర్తాడ్ 40.8, రెంజల్ 40.7, ఇస్సాపల్లి 40.6, చిన్నమావంది 40.6, జక్రాన్‌పల్లి 40.6, కమ్మర్‌పల్లి 40.5, మదనపల్లి 40.5, సాలూర 40.3, భీమ్‌గల్ 40.3, కొండూరు 40.2℃ ఉష్ణోగ్రత నమోదైంది.

News April 1, 2025

NZB: బిక్షాటన డబ్బులు ఎక్కువ వస్తున్నాయని బాలుడి హత్య

image

NZBలో 14 నెలల బాలుడు కైలాస్ హత్య కేసును వన్‌టౌన్ పోలీసులు చేధించారు. మహారాష్ట్రకు చెందిన బోస్లే మాలాబాయి, ఆమె కొడుకు గోపాల్‌ హత్య చేసినట్లు వన్‌టౌన్ SHO రఘుపతి తెలిపారు. పోలీసుల వివరాలు.. కమలాబాయి అనే మహిళకు బిక్షాటన చేసే సమయంలో ఎక్కువ డబ్బులు వస్తున్నాయని.. అదే సమయంలో వీరికి తక్కువ డబ్బులు రావడంతో కక్షతో ఈ నెల 27న రైల్వే స్టేషన్‌లో నిద్రిస్తున్న బాలుడిని తీసుకెళ్లి బండి రాయితో కొట్టి హత్య చేశారు.

error: Content is protected !!