News March 29, 2025

NZB: కరెంట్ షాక్‌తో వ్యక్తి మృతి

image

కరెంట్ షాక్‌తో మృతి చెందినపై ఫోటోలోని వ్యక్తిని గుర్తు పడితే తమకు సమాచారం ఇవ్వాలని నిజామాబాద్ 1వ టౌన్ SHO రఘుపతి కోరారు. ఇతను నెహ్రు పార్క్ ఏరియా దగ్గర ఉన్న లేబర్ అడ్డా దగ్గర నుంచి పనికి వెళ్తు ఉంటాడన్నారు. శుక్రవారం ఖలీల్వాడి, నిజామాబాద్ ఏరియాలో నిర్మాణంలో ఉన్న భవనంలో పని చేస్తుండగా కరెంట్ షాక్ తగిలి చనిపోయాడని చెప్పారు. ఇతడి గురించి తెలిస్తే తమకు సమాచారం అందించాలన్నారు.

Similar News

News April 1, 2025

NZB: ప్రభుత్వ తీరుపై MP ఫైర్

image

HCU భూముల వ్యవహారంలో ప్రభుత్వ తీరుపై నిజామాబాద్ MP అరవింద్ ధర్మపురి ఫైర్ అయ్యారు. ఎంపీ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రియల్ ఎస్టేట్ తప్పా ఏమీ తెలియదు.. అందుకే హెచ్సీయూ భూములను వేలం వేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ నిర్ణయాన్ని NSUI కూడా వ్యతిరేకిస్తోందని అన్నారు. భూముల విషయంలో రాహుల్ గాంధీ కమీషన్ తీసుకోకపోతే రేవంత్ ఆపాలని వ్యాఖ్యానించారు.

News April 1, 2025

NZB:రేపు ఉమ్మడి జిల్లా స్థాయి రెజ్లింగ్ ఎంపికలు

image

నిజామాబాద్ జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 2న నిజామాబాద్, కామారెడ్డి ఉమ్మడి జిల్లా స్థాయి U-20 మహిళా, పురుషుల రెజ్లింగ్ ఎంపికలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్ అధ్యక్షుడు భక్తవత్సలం తెలిపారు. ఈ ఎంపికలు జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్‌లో గల డిఎస్ఏ స్విమ్మింగ్ రెజ్లింగ్ హాల్లో ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతాయన్నారు. ఇందులో పాల్గొనేవారు ఆధార్ కార్డ్, బర్త్ సర్టిఫికెట్ వెంట తేవాలన్నారు.

News April 1, 2025

NZB: IIIT విద్యార్థి ఆత్మహత్య.. కాశీలో అంత్యక్రియలు

image

వర్ని మండలం సత్యనారాయణపురం గ్రామానికి చెందిన <<15944978>>రాహుల్ చైతన్య(18) అలహాబాద్ IIITలో ఆత్మహత్య చేసుకున్న<<>> విషయం తెలిసిందే. కాగా రాహుల్ చైతన్య అలహాబాద్ IIITలో బీటెక్ చేస్తున్నాడు. ఆదివారం తెల్లవారుజామున భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. రాహుల్ చైతన్య అంత్యక్రియలను కాశీలో నిర్వహించారు.

error: Content is protected !!