News September 16, 2024
NZB జిల్లాలో 2వేల మందితో భారీ బందోబస్తు
గణేశ్ నిమజ్జనం సందర్భంగా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా దాదాపు 2వేల మంది సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు మల్టీ జోన్-1 IGP చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. వినాయకుల ఊరేగింపులో ఆకతాయిలను, జేబు దొంగలను నియంత్రించడానికి క్రైమ్, స్పెషల్ బ్రాంచ్, షీ టీమ్లను మఫ్టీలో, పోలీసు భద్రత సిబ్బందిని ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నామని ఆయన వెల్లడించారు.
Similar News
News October 4, 2024
NZB: నేడు నగరానికి రానున్న TPCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్
నూతన TPCC అధ్యక్షునిగా నియమింపబడిన తర్వాత మహేష్ కుమార్ గౌడ్ శుక్రవారం మొదటిసారి నిజామాబాద్ జిల్లా కేంద్రానికి వస్తున్నారు. ఈ క్రమంలో ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేశారు. అలాగే బహిరంగ సభను కూడా ఏర్పాటు చేశారు. ఈ సభలో పలువురు రాష్ట్ర మంత్రులు పాల్గొననున్నారు.
News October 4, 2024
NZB: రీజియన్కు చేరిన 13 ఎలక్ట్రిక్ బస్సులు
నిజామాబాద్ రీజియన్కు మొదటి విడతగా 13 ఎలక్ట్రిక్ బస్సులు చేరుకున్నాయి. వీటిని శుక్రవారం మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్లో మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారభించనున్నట్లు RM జానిరెడ్డి తెలిపారు. ముందుగా ఈ బస్సులను జేబీఎస్ రూట్లలో నడుపనున్నామని, ప్రత్యేకమైన సౌకర్యాలు గల ఈ బస్సుల్లో పెద్దలకు రూ.360, పిల్లలకు రూ.230 చార్జీ ఉంటుందని RM వివరించారు.
News October 4, 2024
NZB: ‘సన్నాలు సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలి’
సన్నాలు సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలని జిల్లా అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. గురువారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ.. వచ్చే జనవరి మాసం నుంచి రాష్ట్ర ప్రజలకు రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం అందించనున్న దృష్ట్యా, రైతులు సన్న రకాలకు చెందిన వరి ధాన్యం పండించేలా ప్రోత్సహించాలని సూచించారు.