News March 3, 2025

NZB: తండ్రి మందలించడంతో అదృశ్యం

image

నిజామాబాద్‌లో తండ్రి మందలించడంతో నవదీప్(17), నవ్య(19) అదృశ్యమైనట్లు వన్ టౌన్ SHO రఘుపతి ఆదివారం రాత్రి తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం మార్చి 1వ తేదీన వీరిద్దరినీ తండ్రి రాజన్న మందలించాడు. దీంతో వారు ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లారు. తిరిగి రాకపోవడంతో తండ్రి రాజన్న బంధువుల వద్ద వెతికినా జాడ దొరకలేదు. దీంతో రాజన్న ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Similar News

News December 17, 2025

నిజామాబాద్ జిల్లాలో 54.69 శాతం పోలింగ్

image

తుది దశ GP ఎన్నికల్లో ఉదయం 11 గంటల వరకు 12 మండలాల్లోని 165 GPల్లో నమోదైన పోలింగ్ శాతం మండలాల వారీగా ఇలా ఉంది.
*ఆలూర్ మండలంలో 56.96%
*ఆర్మూర్ – 56.64 %
*బాల్కొండ – 49.08%
*భీంగల్ -58.68 %
* డొంకేశ్వర్ -56.62 %
*కమ్మర్పల్లి -52.96 %
* మెండోరా -58.14 %
* మోర్తాడ్ -51.48 %
*ముప్కాల్ – 52.77%
*నందిపేట్ – 55.41%
*వేల్పూర్ – 51.48%
*ఏర్గట్ల – 55.45%
పోలింగ్ నమోదైంది.

News December 17, 2025

NZB: 9 గంటల వరకు 23.35 శాతం పోలింగ్

image

తుది దశ GP ఎన్నికల్లో ఉదయం 9 గంటల వరకు 12 మండలాల్లోని 165 GPల్లో 146 SPలకు, 1130 WM లకు నమోదైన పోలింగ్ శాతం మండలాల వారీగా ఇలా ఉంది.
* ఆలూర్ మండలంలో 25.63%,
*ఆర్మూర్ – 26.32%
*బాల్కొండ – 23.04%
*భీంగల్ -24.92%
* డొంకేశ్వర్ – 20.58%
*కమ్మర్పల్లి – 22.12%
* మెండోరా –28.11%
* మోర్తాడ్ – 21.46%
*ముప్కాల్ – 21.06 %
*నందిపేట్ -24.34 %
*వేల్పూర్ – 17.66 %
*ఏర్గట్ల -24.82 %
పోలింగ్ నమోదైనట్లు చెప్పారు.

News December 17, 2025

NZB:తుది దశ GPఎన్నికల్లో ఏకగ్రీవమైన సర్పంచుల వివరాలు

image

బుధవారం నిజామాబాద్ జిల్లాలో జరిగే తుది విడత పోలింగ్‌కు సంబంధించి ఇప్పటికే 19 మంది సర్పంచ్ లు ఏకగ్రీవంగా గెలుపొందారు. మండలాల వారీగా సర్పంచి గా గెలుపొందిన వారి సంఖ్యా వివరాలు ఇలా…
కమ్మర్పల్లి-1,
మోర్తాడ్-1,
భీమ్గల్-4,
వేల్పూర్-4,
ముప్కాల్-1,
ఏర్గట్ల-3,
ఆర్మూర్-1,
ఆలూర్-3,
డొంకేశ్వర్-1