News October 22, 2024

NZB: తండ్రిని హత్య చేసిన కొడుకు.. సహజ మరణంగా చిత్రీకరణ

image

నవీపేట మండలంలో దారుణం జరిగింది. తండ్రి తీరుతో తనకు పెళ్లి కావటం లేదని కుమారుడు తండ్రిని హత్య చేశాడు. పోలీసుల వివరాల ప్రకారం.. అనంతగిరికి చెందిన గౌరు అమృతం(55), అతని కుమారుడు మహిపాల్ ఆదివారం అర్ధరాత్రి మద్యం తాగారు. మద్యం మత్తులో ఉన్న అమృతం మెడకు టవల్ బిగించి హత్య చేశాడు. కాగా అందరికి సహజ మరణంగా నమ్మించాడు. అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయగా బంధువులు మెడకు ఉన్న గాయాలు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

Similar News

News February 3, 2025

NZB:100 మీటర్స్ హర్డిల్స్‌లో గోల్డ్ మెడల్

image

జాతీయస్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్‌లో నిజామాబాద్ జిల్లాకు చెందిన పల్లవిరెడ్డి 100 మీటర్ల హార్డిల్స్‌లో గోల్డ్ మెడల్ సాధించింది. కేరళ రాష్ట్రంలోని త్రిసూర్ జిల్లాలో జరుగుతున్న మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీల్లో భాగంగా 40 ఏళ్ల పై కేటగిరిలో పల్లవి గోల్డ్ మెడల్ సాధించారు. తెలంగాణకు చెందిన శివ లీల సిల్వర్ మెడల్, జయలక్ష్మి బ్రాంజ్ మెడల్ సాధించారు.

News February 3, 2025

NZB: విద్యుత్ దీపాల అలంకరణలో నీల కంఠేశ్వరాలయం

image

సుమారు 1400 సంవత్సరాల చరిత్ర కలిగిన నిజామాబాద్‌లోని నీల కంఠేశ్వరాలయం బ్రహోత్సవాలకు సన్నద్ధమైంది. సోమవారం శివాభిషేకాలు, మంగళవారం రథ సప్తమి వేడుకల్లో భాగంగా రథ శోభ యాత్ర, బుధవారం స్వామి వారి పుష్కరిణిలో చక్రస్నానం తదితర ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయని అలయ ఈవో రవీందర్ తెలిపారు. ఈ సందర్భంగా దేవాలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు.

News February 3, 2025

NZB: జిల్లా జైలును సందర్శించనున్న DG సౌమ్య మిశ్రా

image

నిజామాబాద్ జిల్లాలోని సారంగపూర్‌లో ఉన్న జిల్లా జైలును సోమవారం జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ (DG) సౌమ్య మిశ్రా సందర్శించనున్నట్లు జైళ్ల శాఖ అధికారులు తెలిపారు. ఉదయం జిల్లా జైలుకు వచ్చే ఆమె అక్కడ పరిశీలించి అనంతరం మీడియాతో మాట్లాడతారని అధికారులు వివిరించారు. కాగా ఆమె పర్యటన కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.