News August 1, 2024
NZB: పని ఇప్పిస్తానని.. కత్తితో దాడి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_82024/1722487112592-normal-WIFI.webp)
హైదరాబాద్లో పని ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి కత్తితో గాయపరిచి ఉడాయించిన ఘటన జీడిమెట్ల PS పరిధిలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు కామారెడ్డి జిల్లాకు చెందిన యాదికి, శ్రీనివాస్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. జీడిమెట్లకు తీసుకొచ్చి ఓ వైన్షాపు వద్ద మద్యం తాగారు. బుధవారం మళ్లీ మద్యం తాగి యాది వద్ద ఉన్న డబ్బులు ఇవ్వాలని శ్రీనివాస్ గొడవకు దిగాడు. దీంతో ఒప్పుకోకపోవడంతో కత్తితో దాడి చేశాడు.
Similar News
News February 7, 2025
NZB: CPకి MIM నాయకుల వినతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738847646011_50139228-normal-WIFI.webp)
రంజాన్ నేపథ్యంలో అర్ధరాత్రి దుకాణాలు తెరవడానికి అనుమతించాలని కోరుతూ MIMనాయకులు గురువారం నిజామాబాద్ ఇన్ఛార్జి CP సింధూశర్మకు వినతిపత్రం అందజేశారు. ఈ నెల 13, 14 తేదీల్లో షబ్-ఎ-బరాత్, రంజాన్ మాసం సందర్భంగా అహ్మదీ బజార్, గాంధీ చౌక్, నెహ్రూ పార్క్, ఖిల్లా రోడ్, బోధన్ చౌక్ ప్రాంతాల్లో అర్ధరాత్రి దుకాణాలు నిర్వహించుకోవడానికి అనుమతించాలని కోరారు.
News February 7, 2025
చౌడమ్మ కొండూరులో పోటెత్తిన భక్తజనం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738850712126_51975764-normal-WIFI.webp)
నందిపేట మండలంలోని చౌడమ్మ కొండూరు గ్రామంలో స్వయంభుగా వెలసినటువంటి చాముండేశ్వరి దేవి అమ్మవారి ఆలయం పునర్నిర్మించి నూతన విగ్రహాల ప్రతిష్ఠ మహోత్సవాలలో భాగంగా ఇవాళ చండీ హోమం నిర్వహించారు. చుట్టుపక్కల ఉమ్మడి మండలంలోని భక్తులంతా అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చారు. అమ్మవారి ప్రాంగణమంతా భక్తులతో కిటకిటలాడింది. కార్యక్రమంలో భాగంగా ఆలయ కమిటీ వారు వచ్చిన భక్తులకు అన్నదానం నిర్వహించారు.
News February 7, 2025
కోటగిరి: ఎత్తోండ క్యాంపులో అక్రమ ఇసుక డంపులు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738848309901_51940040-normal-WIFI.webp)
కోటగిరి మండలం ఎత్తోండ క్యాంపును అడ్డగా మలుచుకున్న కొందరు ఇసుక సూరులు యదేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా సాగిస్తున్నారు. గ్రామంలోని హనుమాన్ మందిరం వద్ద గల ఖాళీ స్థలంలో ఇసుక డంపులు చేసి రాత్రికి రాత్రి వాటిని టిప్పర్ల ద్వారా బోధన్, నిజాంబాద్ పట్టణాలకు తరలిస్తూ అక్రమార్జనకు పాల్పడుతున్నారు. ఈ విషయమై గ్రామస్థులు అధికారుల దృష్టికి తీసుకుపోయినా పట్టించుకోవడంలేదని ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.