News April 8, 2025

NZB: పాప కనిపిస్తే సమాచారం ఇవ్వండి: SHO

image

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్‌లో తల్లి పక్కన నిద్రిస్తున్న మూడేళ్ల చిన్నారి రమ్య కిడ్నాప్‌కు గురైన విషయం తెలిసిందే. సీసీ కెమెరాలో ఓ దుండగుడు చిన్నారిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన దృశ్యాలు రికార్డు అయ్యాయి. ఈ ఘటనపై వన్ టౌన్ పోలీసులు ప్రత్యేక బృందలతో గాలింపు చర్యలు చేపట్టారు. చిన్నారి ఆచూకీ తెలిస్తే 8712659837 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని వన్ టౌన్ SHO రఘుపతి సూచించారు.

Similar News

News April 8, 2025

టీయూలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్!

image

తెలంగాణ యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వర్సిటీలో మొత్తం 89 పోస్టులకు గానూ 48 మంది మాత్రమే పని చేస్తున్నారు. ఇంకా 41 ఖాళీలు ఉన్నాయి. అకడమిక్‌ రికార్డ్, పరిశోధనలు, విషయ పరిజ్ఞానం, బోధన నైపుణ్యం, ఇంటర్వ్యూ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. కాగా ఈ పోస్టుల్లో ఎన్ని భర్తీ చేస్తారనే విషయాన్ని ప్రభుత్వం ఇంకా వెల్లడించలేదు.

News April 8, 2025

నిజామాబాద్‌లో రైలు ఢీకొని వ్యక్తి మృతి

image

రైలు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన డిచ్‌పల్లి స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. నిజామాబాద్ రైల్వే ఎస్ఐ సాయి రెడ్డి తెలిపిన వివరాలు.. సోమవారం రాత్రి డిచ్పల్లి రైల్వే స్టేషన్ ప్రాంతంలో రైలు పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడి వయసు సుమారు 30-35 ఏళ్లు ఉండొచ్చని అంచనా వేశారు. వివరాలు తెలిసిన వారు 8712658591 నంబరును సంప్రదించాలన్నారు.

News April 8, 2025

గాంధారి: అడవిలోకి తీసుకెళ్లి దాడి.. మహిళ మృతి

image

అడవిలోకి తీసుకెళ్లి మహిళపై దాడి చేసి చంపేసిన ఘటన సోమవారం గాంధారిలో చోటుచేసుకుంది. SI ఆంజనేయులు తెలిపిన వివరాలు.. చందాపూర్ తండాకు చెందిన పీరాజి HYDలో బిక్షాటన చేస్తూ జీవిస్తున్నాడు. అక్కడే బిక్షాటనే చేస్తున్న అమీనాబేగం తన 4ఏళ్ల కొడుకును అమ్మేసిందనే అనుమానంతో ఆమెను HYD నుంచి తండా అడవి ప్రాంతానికి తీసుకొచ్చాడు. అక్కడ ఆమెపై దాడి చేసి గాయపరిచాడు. అనంతరం భయంతో ఆసుపత్రికి తరలించగా ఆమె మృతి చెందింది.

error: Content is protected !!