News September 23, 2024
NZB: పేకాట స్థావరంపై పోలీసుల దాడులు.. పదిమంది అరెస్ట్

నగరంలో పేకాట స్థావరంపై పోలీసులు దాడులు నిర్వహించి పదిమందిని అదుపులోకి తీసుకున్నారు. నమ్మదగిన సమాచారం మేరకు వన్ టౌన్ పరిధిలోని నాగేంద్రుడి గుడి వెనకాల గల ప్రదేశంలో పేకాట ఆడుతుండగా వన్ టౌన్ SHO విజయబాబు, తన సిబ్బందితో ఆదివారం దాడులు నిర్వహించారు. ఈ దాడిలో పదిమంది పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 9200 నగదు, రెండు బైక్లు, 9 స్మార్ట్ ఫోన్ లను స్వాధీన పరుచుకున్నారు.
Similar News
News March 11, 2025
NZB: పోలీస్ స్టేషన్లో వ్యక్తికి సంకెళ్లు

పోలీస్ స్టేషన్లో ఓ వ్యక్తితో వెట్టి చాకిరి చేయించిన ఘటన బోధన్లో జరిగింది. ఓ కేసులో అరెస్టు చేసిన వ్యక్తి కాళ్లకు సంకెళ్లు వేసి ఆ వ్యక్తితో పోలీస్ స్టేషన్ను ఊడిపించారు. కానిస్టేబుల్ గంగాధర్ ముందే పోలీస్ స్టేషన్లో చీపురుతో క్లీన్ చేస్తున్న చిత్రాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
News March 11, 2025
నిజామాబాద్: చేపల వేటకు వెళ్లిన వ్యక్తి మృతి

చేపల వేటకు వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందిన ఘటన ఎడపల్లి మండలంలోని అంబం(వై) గ్రామ శివారులో సోమవారం రాత్రి జరిగింది. పోలీసుల వివరాలిలా.. అంబం(వై) గ్రామానికి చెందిన కొత్తోళ్ల ఒడ్డెన్న(55) గ్రామ శివారులోని పెద్దవాగులో సోమవారం సాయంత్రం చేపలు పట్టేందుకు వెళ్లారు. ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతిచెందారు. ఈ ఘటనపై కేసు నమోదైంది.
News March 11, 2025
NZB: గీతకార్మికుడిపై ఎలుగుబంటి దాడి

గీత కార్మికుడిపై ఎలుగుబంటి దాడి చేసిన ఘటన జక్రాన్పల్లి మండలం కలిగోట్లో జరిగింది. కలిగోట్ కోరట్ పల్లి సరిహద్దులో గల వాగులో మెతుకు రాములు అనే గీత కార్మికుడు ఈతచెట్ల వద్దకు కల్లు తేవడానికి వెళ్లగా ఒక్కసారిగా ఎలుగుబంటి దాడి చేసింది. అతని చేతికి స్వల్పగాయమైంది. క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. ఎలుగుబంటి సంచారంపై అటవీ శాఖ అధికారులు దృష్టి పెట్టాలని స్థానికులు కోరుతున్నారు.