News April 17, 2024

NZB: రికార్డ్‌స్థాయిలో 2.69 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ

image

రాష్ట్రంలో ఈసారి యాసంగిలో ఇప్పటివరకు రికార్డ్‌స్థాయిలో 2.69లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరిగిందని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ దేవేంద్రసింగ్ జవాన్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో అధికారులతో మాట్లాడుతూ.. అవసరమైతే ఇంకా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అధికారులు సమన్వయంతో పనిచేస్తూ కేంద్రంలో సరిపడా టర్పైన్లు, ఇతర సదుపాయాలు ఉండేలా చూసుకోవాలన్నారు.

Similar News

News September 30, 2024

నిజామాబాద్‌లో 8,30,580 ఓటర్లు ఉన్నారు..!

image

నిజామాబాద్ జిల్లాలో 27 మండలాలు ఉండగా 545 గ్రామపంచాయతీలో 5022 వార్డులు ఉన్నాయి. జిల్లా మొత్తంలో 8,30,580 మంది ఓటర్లు ఉన్నట్లు తేలింది. ఇందులో 4,43,548 మంది మహిళా ఓటర్లు ఉండగా.. 3,87,017 మంది పురుషులు, 15 మంది ట్రాన్స్ జెండర్లు ఉన్నట్లుగా అధికారులు తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మహిళా ఓటర్లు అధికంగా ఉండడంతో పంచాయతీ ఎన్నికల్లో వారు కీలకంగా మారనున్నారు.

News September 30, 2024

నిజామాబాద్: కాసేపట్లో DSC రిజల్ట్స్.. అభ్యర్థులు వీరే!

image

DSC ఫలితాలు కాసేపట్లో విడుదల కానున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎస్జీటీ పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి.
జిల్లా అభ్యర్థులు పోస్టులు పోటీ
కామారెడ్డి 3560 272 1:13
నిజామాబాద్ 3204 285 1:11

News September 30, 2024

రేపు కామారెడ్డికి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి

image

కామారెడ్డి: స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా అక్టోబర్ 1వ తేదీ మంగళవారం కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి జిల్లా కేంద్రానికి రానున్నట్లు ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి చెప్పారు. స్థానిక కొత్త బస్టాండ్‌లో స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొంటారని, అనంతరం పట్టణంలోని తిలక్ రోడ్డులో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నా తర్వత రాజారెడ్డి గార్డెన్‌లో పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారన్నారు.