News July 5, 2024
NZB: విద్యుత్ షాక్తో వ్యక్తి మృతి
విద్యుత్ షాక్తో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ఇందల్వాయి మండలం గౌరారంలో గురువారం జరిగింది. పోలీసుల వివరాలు.. ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ లైన్లు మరమ్మతులు చేస్తూ జీవించే పరమేశ్వర్ వ్యవసాయ పొలంలో పని చేస్తుండగా 11 కేవీ వైరు తగిలి మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నట్లు వెల్లడించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మనోజ్ తెలిపారు.
Similar News
News October 6, 2024
నిజామాబాద్: ముగ్గురు ఆత్మహత్య..UPDATE
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం వడ్డేపల్లిలో ఒకే కుటుంబానికి చెందిన <<14277266>>ముగ్గురు <<>>సురేశ్ (53), హేమలత (45), హరీశ్ (22) అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కాగా వారు సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు కొన్ని నెలల క్రితం ఇంటి పనులు ప్రారంభించారు. అప్పులు, ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోవటంతో నిర్మాణ పనులు నిలిపివేశారు. ఈ క్రమంలోనే ఆత్మహత్యకు పాల్పడ్డట్లు పోలీసులు తెలిపారు.
News October 6, 2024
నిజామాబాద్కు కూడా హైడ్రా తరహా వ్యవస్థ వస్తోంది: మహేశ్ కుమార్
నిజామాబాద్కు కూడా హైడ్రా తరహా వ్యవస్థ వస్తుందని TPCC అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. శనివారం ఆయన NZBలో మీడియాతో చర్చాగోష్టిలో మాట్లాడుతూ.. హైడ్రా తరహా నిడ్రా ఏర్పాటు చేయాలన్న డిమాండ్లు వస్తున్నాయన్నారు. హైదరాబాద్లో హైడ్రా చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. వయనాడ్గా హైదరాబాద్ పరిస్థితి మారకూడదంటే మూసీ నదిని ప్రక్షాళన చేయాల్సిందేనని అన్నారు.
News October 5, 2024
NZB: హరీశ్ రావు మాట తప్పారు: మహేష్ కుమార్ గౌడ్
రుణ మాఫీ విషయంలో బీఆర్ఎస్ నేత హరీశ్ రావు రాజీనామా చేస్తానని చెప్పి మాట తప్పారని TPCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం హయంలో జరిగిన రుణమాఫీ, కాంగ్రెస్ తొమ్మిది నెలలు జరిగిన రుణమాఫీపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. కొండా సురేఖ వివాదంపై మాట్లాడుతూ.. అది ముగిసిన వివాదం అన్నారు.