News October 15, 2024

NZB: స్పెషల్ బస్సులు.. భారీగా RTC ధరలు

image

దసరా సెలవులు ముగిసిన నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా RTC అధికారులు ప్రత్యేక బస్సులు ఏర్పాటుచేశారు. కాగా బోధన్ నుంచి NZBకు ఎక్స్‌ప్రెస్ బస్సు సాధారణ సమయాల్లో రూ.50 ఉండగా.. తాజాగా రూ.70 తీసుకుంటున్నారు. అదేంటని ప్రశ్నిస్తే దసరా సందర్భంగా ప్రత్యేక బస్సులు ఏర్పాటుచేశారని, అందుకే ధర పెంచినట్లు తెలిపారు. ఈ క్రమంలో కండక్టర్‌కు, ప్రయాణికుల మధ్య కాస్త వాగ్వాదం జరిగింది.
– మీ వద్ద ధరలు ఎలా ఉన్నాయి..?

Similar News

News October 16, 2024

NZB:త్వరలో బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ: మంత్రి సీతక్క

image

చాలకాలంగా పెండింగ్లో ఉన్న NZB, అదిలాబాద్ సహా అన్ని జిల్లాల్లో అన్ని శాఖల బ్యాక్‌లాగ్ పోస్టులను త్వరలో భర్తీ చేయనున్నట్లు రాష్ట్రమంత్రి సీతక్క తెలిపారు.బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీపై కసరత్తు జరుగుతోందని HYD సెక్రటేరియట్ సమావేశంలో పేర్కొన్నారు. మహిళా సంక్షేమ శాఖలో 10 మందికి అపాయింట్​ మెంట్​ లెటర్స్​ అందజేశారు. ఈ కార్యక్రమంలో మహిళ శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి కరుణ, తదితరులు పాల్గొన్నారు.

News October 16, 2024

నిజామాబాద్: SRSP పరీవాహక ప్రజలకు హెచ్చరిక

image

SRSP ప్రాజెక్ట్ 100 శాతం నిండిపోయి పైనుంచి అదనపు నీటిప్రవాహం ఉన్నందున బుధవారం (నేటి) ఉదయం ఎస్కేప్ గేట్లుఎత్తి నీటిని గోదావరిలోకి విడుదల చేయనున్నట్లు పోచంపాడ్ డ్యాం సైట్ కార్యనిర్వాహక ఇంజినీర్ చక్రపాణి ఓ ప్రకటనలో తెలిపారు. మత్స్యకారులు, పశువుల కాపర్లు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎవరూ నదిలోకి దిగొద్దని, ప్రమాదానికి గురికావద్దని ఆయన సూచించారు.

News October 16, 2024

నాయకత్వ లోపంతో హైదరాబాద్‌లో BJP ఓటమి: ఎంపీ అర్వింద్

image

నాయకత్వ లోపంతోనే హైదరాబాద్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయిందని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. GHMC ఎన్నికల్లో 48 చోట్ల గెలిచిన బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్లో ఒక్క సీటుకు మాత్రమే ఎందుకు పరిమితమైందని ప్రశ్నించారు. బీజేపీలో సమన్వయ లోపం ఉందన్నారు.